IRCTC Shirdi Tour : తగ్గిన షిర్డీ ట్రిప్ ధర.. విజయవాడ నుంచి తాజా ప్యాకేజీ ఇదే
09 April 2023, 17:56 IST
- IRCTC Shirdi Tour: విజయవాడ నుంచి షిర్డీకి టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను పేర్కొంది.
విజయవాడ - షిర్డీ టూర్ ప్యాకేజీ
IRCTC Shirdi Tour From Vijayawada: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్సీటీసీ టూరిజం. తాజాగా షిర్డీ సాయిబాబా భక్తుల కోసం గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ నుంచి షిర్డీకి వెళ్లేందుకు రైల్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 'SAI SANNIDHI EX - VIJAYAWADA' పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ. ప్రతీ మంగళవారం ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ ఏప్రిల్ 18వ తేదీన అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీలో సాయిబాబా దర్శనంతో పాటు శనిశిగ్నాపూర్ కూడా కవర్ అవుతుంది.
Day 1: మొదటి రోజు విజయవాడలో స్టార్ట్ అవుతుంది. రాత్రి 10.15 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్లో సాయినగర్ షిరిడీ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కాలి. రాత్రంతా జర్నీ ఉంటుంది.
Day 2: రెండో రోజు ఉదయం 6.15 గంటలకు నాగర్సోల్ చేరుకుంటారు. ఆ తర్వాత షిర్డీకి బయల్దేరుతారు. హోటల్లో చెకిన్ అయిన తర్వాత షిరిడీ ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం షాపింగ్ కోసం ఫ్రీ టైమ్ ఉంటుంది. రాత్రికి షిరిడీలో బస చేయాల్సి ఉంటుంది.
Day 3 : ఇక 3వ రోజు ఉదయం శనిశిగ్నాపూర్ సందర్శన ఉంటుంది. అక్కడ్నుంచి మళ్లీ షిరిడీ చేరుకోవాలి. రాత్రి 7.30 గంటలకు నాగర్సోల్ స్టేషన్లో తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
Day 4 : తెల్లవారుజామున 2.50 విజయవాడ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
రేట్ల వివరాలు....
ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే….. కంఫర్ట్ క్లాస్ (3ఏ)లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 14, 740 ధర ఉండగా... డబుల్ ఆక్యుపెన్సీకి రూ.9380, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 78800 చెల్లించాలి. ఐదు నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. కింది జాబితాలో వివరాలను చెక్ చేసుకోవచ్చు.
NOTE
ఈ టూర్ ను బుకింగ్ చేసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేసి వివరాలను నమోదు చేసుకోవచ్చు.