తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Increased Vigilance In Andhra Borders In The Wake Of Karnataka Assembly Elections

Karnataka Elections: కర్ణాటకలో ఎన్నికలు..ఆంధ్రా సరిహద్దుల్లో అలర్ట్

HT Telugu Desk HT Telugu

02 May 2023, 11:56 IST

    • Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆంధ్రాతో సరిహద్దులు ఉన్న ప్రదేశాల్లో గస్తీ పెంచాలని సీఈసీ ఆదేశించారు. 
కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో అలర్ట్
కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో అలర్ట్

కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో అలర్ట్

Karnataka Elections: మే 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో అక్రమ మద్యం, నగదు వంటివి రవాణా చేయకుండా నియంత్రించేందుకు 45 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిజవహర్ రెడ్డి కేంద్ర ప్రధాన ఎన్నికల కమీషనర్ కు వివరించారు. ఢిల్లీ నుండి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు గోయల్, పాండేలతో కలిసి కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దు కలిగిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా,మహారాష్ట్ర, గోవా,కేరళ,తమిళనాడు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, డిజిపిలు, ఎన్నికల సంఘం సిఇఓలు ఇతర సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ట్రెండింగ్ వార్తలు

AP ICET Hall Tickets: ఏపీ ఐసెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదల, మే 6,7 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష

AP ECET Hall Tickets: ఏపీ ఈసెట్‌ 2024 హాల్‌టిక్కెట్లు విడుదల, రూ.5వేల జరిమానాతో నేడు కూడా దరఖాస్తుల స్వీకరణ

Nalgonda Ellayya: వీడిన నల్గొండ కాంగ్రెస్‌ నాయకుడు ఎల్లయ్య మర్డర్ మిస్టరీ, ట్రాప్‌ చేసి జగ్గయ్యపేటలో హత్య

AP TS Summer Updates: పగటిపూట బయట తిరగకండి, ముదురుతున్న ఎండలు… వడదెబ్బకు ప్రాణాలు విలవిల

కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దులు కలిగిన జిల్లాల్లో పోలీస్, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు,రెవెన్యూ తదితర విభాగాల అధికారులు, సిబ్బందితో కూడిన 45 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. చెక్ పోస్టుల ద్వారా ఇప్పటి వరకూ 3వేల లీటర్ల అక్రమ ఐఎంఎఫ్ఎల్ లిక్కర్, ఒక్కొక్కటి 90 మిల్లీ లీటర్లు కలిగిన 444 టెట్రా ఫ్యాక్ లు,రెండున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ మద్యం,నగదు రవాణా చేయకుండా ఆయా చెక్ పోస్టులలో నిరంతరం నిఘా పెట్టామని డిజిపి కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు తెలిపారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ రానున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడా అక్రమ మద్యం,నగదు రవాణా కాకుండా సరిహద్దు రాష్ట్రాల చెక్ పోస్టులు ద్వారా నిరంతర నిఘాపెట్టి విస్తృతమైన తనిఖీలు చేపట్టాలని ఆయా రాష్ట్రాల సిఎస్,డిజిపిలను ఆదేశించారు.అసాంఘిక శక్తులు ప్రవేశించకుండా చెక్ పోస్టుల్లో కట్టిదిట్టమైన నిఘా పెట్టాలని ఆదేశించారు.మహిళలు,యువత భాగస్వామ్యంతో ఓటింగ్ శాతం పెరిగేలా చూడడంతో పాటు హింసాత్మక సంఘటనలకు ఆస్కారం లేని విధంగా రీపోల్ అవకాశం లేని రీతిలో ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని సిఇసి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.