AP CM Jagan: సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలకు ఏపీ సీఎం జగన్..
07 February 2022, 12:41 IST
సీఎం వైఎస్ జగన్ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరుకానున్నారు.
సీఎం జగన్ (ANI)
సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఇవాళ హైదరాబాద్ రానున్నారు. ముచ్చింతల్ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొననున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3.50 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి..జగన్ హైదరాబాద్కు బయలుదేరుతారు. సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి ముచ్చింతల్ వెళ్తారు. అక్కడ ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం తిరిగి రాత్రి 9.05 గంటలకు సీఎం జగన్ తాడేపల్లికి వస్తారు.
ట్రెండింగ్ వార్తలు