Supreme Court On Polavaram : పోలవరంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు-supreme court suggests to centre call for meeting of stakeholders over polavaram project ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Supreme Court Suggests To Centre Call For Meeting Of Stakeholders Over Polavaram Project

Supreme Court On Polavaram : పోలవరంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

HT Telugu Desk HT Telugu
Sep 06, 2022 09:22 PM IST

Polavaram Project Issue : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలపై చర్చించి పరిష్కరించేలా చూడాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. స్టేక్‌హోల్డర్లందరినీ సమావేశపరచాలని కేంద్రానికి సూచించింది.

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు (HT_PRINT)

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సరిహద్దు రాష్ట్రాలు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేసింది. పోలవరంపై వాస్తవాలతో కూడిన నివేదిక అందించాలని ఆదేశాలిచ్చింది. అవసరం అనుకుంటే.. సీఎంలు, సీఎస్‌ల స్థాయిలో చర్చలు జరపాలని ధర్మసనం పేర్కొంది. నిర్మాణంలో పర్యావరణ అనుమతులు పాటించలేదని తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. తమ రాష్ట్రాల్లో ముంపు సమస్యలు ఉన్నాయన్నయని పిటిషన్లు దాఖలయ్యాయి.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు స్టేక్‌హోల్డర్లందరినీ సమావేశపరచాలని కేంద్రానికి సుప్రీంకోర్టు మంగళవారం సూచించింది. కేంద్రం చొరవ తీసుకుని వాటాదారులందరినీ పిలిపిస్తే, ప్రాజెక్టు ముందుకు సాగి, ఆందోళనలు పరిష్కరిస్తే అది ‘ఫిట్‌నెస్‌ ఆఫ్‌ థింగ్‌’లో ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నందున ప్రాజెక్టు ప్రభావం గురించి ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని జస్టిస్ ఎస్‌కే కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

జస్టిస్ ఎఎస్ ఓకా మరియు విక్రమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం, ప్రాజెక్ట్ అనుకున్నట్లుగా చాలా పెద్ద స్థాయిలో విస్తరించబడిందని పేర్కొంది. దాని విస్తరణ కారణంగా పర్యావరణ అనుమతులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని కూడా సమర్పించినట్లు తెలిపింది. 'జల శక్తి మంత్రిత్వ శాఖ ఒక మార్గదర్శక పాత్రను పోషించాలి. అన్ని వాటాదారులతో సమావేశాన్ని నిర్వహించాలి.' అత్యున్నత న్యాయస్థానం సూచించింది. సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయిలో సమావేశం నిర్వహించాలని చెప్పింది.

ఈ సమావేశాన్ని క్రమం తప్పకుండా నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ తేదీ కోసం కోర్టు ముందు వేచి ఉండకూడదని పేర్కొంది. డిసెంబరు 7న విచారణకు వాయిదా వేసి.. కేంద్రం నుంచి నివేదికను కోరింది. విచారణ సందర్భంగా ఈ విషయంలో లేవనెత్తిన ఆందోళనలను పరిశీలించి, పని చేయాలని బెంచ్ సూచించింది. 'ఇవన్నీ పరస్పరం ఆమోదయోగ్యమైన పరిస్థితిలో పరిశీలించి పని చేయాల్సిన అంశాలు.' అని బెంచ్ వ్యాఖ్యానించింది.

IPL_Entry_Point