National Teachers Award 2022 : నేషనల్​ టీచర్స్​ అవార్డు అందుకున్న తెలంగాణవాసి-telangana teacher gets national teachers award 2022 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  National Teachers Award 2022 : నేషనల్​ టీచర్స్​ అవార్డు అందుకున్న తెలంగాణవాసి

National Teachers Award 2022 : నేషనల్​ టీచర్స్​ అవార్డు అందుకున్న తెలంగాణవాసి

Sharath Chitturi HT Telugu
Sep 05, 2022 04:05 PM IST

National Teachers Award 2022 : ఈసారి 45మంది టీచర్లు.. నేషనల్​ టీచర్స్​ అవార్డును అందుకున్నారు. వారిలో తెలంగాణవాసి కండాల రామయ్య కూడా ఉన్నారు.

నేషనల్​ టీచర్స్​ అవార్డు అందుకున్న తెలంగాణవాసి
నేషనల్​ టీచర్స్​ అవార్డు అందుకున్న తెలంగాణవాసి

National Teachers Award 2022 : జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవరం సందర్భంగా.. 2022 నేషనల్​ టీచర్స్​ అవార్డు​లను విజేతలకు ప్రదానం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వివిధ విధానాలతో విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపి, వారిలో ప్రతిభను బయటకు తీసుకొచ్చిన పలువురు ఉపాధ్యాయులు.. రాష్ట్రపతి చేతుల మీదుగా 2022 నేషనల్​ టీచర్స్​ అవార్డును తీసుకున్నారు. వీరిలో తెలంగాణవాసి కండాల రామయ్య కూడా ఉన్నారు.

కండాల రామయ్య, జెడ్​పీ హై స్కూల్​ అబ్బాపూర్​..

Kandala Ramaiah ZP High School Abbapur : తెలంగాణ అబ్బాపూర్​లోని జిల్లా పరిషద్​ హై స్కూల్​లో టీచర్​గా పనిచేస్తున్నారు కండాల రామయ్య. స్థానిక పరిసరాలను ఉపయోగించుకుని.. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో గణితాన్ని నేర్పిస్తుండటం కండాల రామయ్య ప్రత్యేకత! 'మ్యాథ్​ రంగోలీ'ని ప్రవేశపెట్టారు. ముఖ్యమైన ఆకారాలను రంగోలీగా గీసి, అవసరమైతే వాల్​ పెయింట్స్​ కూడా వేసి విద్యార్థులకు బోధిస్తున్నారు.

అంతేకాకుండా.. స్కూలులో మౌలిక వసతులను పెంపొందించేందుకు.. సామాజిక మాధ్యమాల ద్వారా క్రౌడ్​ ఫండింగ్​ చేపట్టారు కండాల రామయ్య. "మన ఊరు- మన బడి" అనే నినాదంతో ముందుకు సాగుతూ.. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిస్తున్నారు.

కండాల రామయ్యతో పాటు.. మొత్తం మీద 45మంది నేషనల్​ టీచర్స్​ అవార్డులను దక్కించుకున్నారు. వారిలో కొందరు..

  • అమిత్​ కుమార్​- జవహర్​ నవోదయ్​ విద్యాలయ, హిమాచల్​ ప్రదేశ్​.
  • మమత అహర్​- ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అసిస్టెంట్​ టీచర్​- రాయ్​పూర్​.
  • మహమ్మద్​ జబీర్​- గవర్నమెంట్​ మిడిల్​ స్కూల్​- కార్గిల్​ లద్దాఖ్​.
  • అరుణ్​ కుమార్​ గర్గ్​- జీఎంఎస్​ఎస్​ డేటావాస్​ ప్రిన్సిపాల్​ పంజాబ్​.
  • గమ్చి తిమ్రి ఆర్​. మారక్​- ఎడ్జ్యూకేర్​ హయ్యర్​ సెకండరీ స్కూల్​- మేఘాలయ.
  • కుర్షీద్​ అహ్మద్​- కాంపోజిట్​ స్కూల్​ సాహావా- ఉత్తర్​ప్రదేశ్​.
  • రజ్ని శర్మ- నిగం ప్రతిభ విద్యాలయ- వాయువ్య ఢిల్లీ.

భారత దేశా తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా.. ప్రతి ఏటా సెప్టంబర్​ 5న.. జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటుంది దేశం. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపి, వారిలో ప్రతిభను గుర్తించే పలువురు ఉపాధ్యాయులకు ప్రతియేట నేషనల్​ టీచర్స్​ అవార్డులు ఇస్తోంది కేంద్రం.

IPL_Entry_Point

సంబంధిత కథనం