Telugu News  /  Andhra Pradesh  /  520 Special Buses And Trains From Vizag
ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Dasara Rush In Vizag : వైజాగ్ నుంచి 520 స్పెషల్ బస్సులు.. ప్రత్యేక రైళ్లూ కూడా

03 October 2022, 15:59 ISTHT Telugu Desk
03 October 2022, 15:59 IST

Special Buses and Trains from Visakhapatnam : దసరా పండుగ దృష్ట్యా విశాఖపట్నం బస్సు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని తీర్చడానికి ప్రత్యేక బస్సులు, రైళ్లు ప్రవేశపెట్టారు. ఈ మేరకు ప్రయాణికులు వినియోగించుకోవాలని.. అధికారులు కోరారు.

అక్టోబర్ 6 వరకు పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులు ప్రకటించడంతో ద్వారకా బస్ స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దసరా రద్దీని క్లియర్ చేయడానికి, ఆర్టీసీ విశాఖపట్నం నుండి హైదరాబాద్, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి వంటి ప్రధాన ప్రాంతాలకు అక్టోబర్ 9 వరకు 520 ప్రత్యేక బస్సులను ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

ఆర్టీసీ విశాఖపట్నం రీజినల్ మేనేజర్ అప్పల రాజు మాట్లాడుతూ ప్రస్తుతం విశాఖపట్నం టూ వివిధ ప్రాంతాల మధ్య అక్టోబర్ 4 వరకు 280 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు.హైదరాబాద్‌కు 40, విజయవాడకు 70, రాజమండ్రికి 50, కాకినాడకు 20, శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, పాతపట్నానికి 100 బస్సులు నడుస్తున్నాయి. పలాస, విజయనగరానికి కూడా ప్రత్యేక బస్సులు ఉన్నాయి.

దసరా తర్వాత విశాఖపట్నం, ఇతర ప్రాంతాల మధ్య అక్టోబరు 6 నుంచి 9 వరకు మరో 240 ప్రత్యేక బస్సులు నడపనుండగా.. ఇందులో హైదరాబాద్‌కు 20, విజయవాడకు 100, రాజమండ్రికి 50, కాకినాడకు 20, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు 50 ఉన్నాయి.

దసరా సీజన్‌లో ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని ఆర్టీసీ ప్రకటించింది. డిమాండ్‌ను బట్టి అవసరమైతే అదనపు బస్సులను నడపడానికి సంస్థ సిద్ధంగా ఉంది. మరోవైపు, విశాఖపట్నం-హైదరాబాద్ మరియు మహబూబ్‌నగర్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రారంభించారు. రైల్వే నుండి తదుపరి నోటీసు వచ్చే వరకు నడుస్తోంది.