తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Minister Mallareddy, It Department File Cases Against Each Other

Mallareddy Vs IT : మల్లారెడ్డి వర్సెస్ ఐటీ అధికారులు.. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు

HT Telugu Desk HT Telugu

24 November 2022, 19:53 IST

    • IT Raids On Mallareddy : మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. గురువారం ఉదయంతో సోదాలు ముగిశాయి. అయితే ఓ వైపు ఐటీ అధికారులు, మరోవైపు మంత్రి మల్లారెడ్డి ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.
మంత్రి మల్లారెడ్డి
మంత్రి మల్లారెడ్డి

మంత్రి మల్లారెడ్డి

మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు ముగిశాయి. ఒడిశా, కర్నాటక నుంచి కూడా ఐటీ అధికారులు వచ్చి తనిఖీల్లో పాల్గొన్నారు. సుమారు 65 బృందాలు.. 400 మంది అధికారులు సోదాలు చేశారు. ఐటీ శాఖ తనిఖీల నుంచి తాఖీదులదాకా వెళ్లింది. పోలీస్‌ స్టేషన్‌లో కేసులు కూడా నమోదయ్యాయి. మల్లారెడ్డి ఆస్పత్రికి పరుగులు పెట్టి ఐటీ అధికారి రత్నాకర్‌ని వెంటపెట్టుకొని వచ్చారు. అదే సమయంలో ల్యాప్‌టాప్‌, ఫోన్లు లాక్కున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మల్లారెడ్డిపై ఐటీ అధికారులు ఐదు అంశాలతో ఫిర్యాదు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Siddipet District : సరిగ్గా చూసుకొని కొడుకు...! కొండగట్టు ఆలయానికి ఆస్తిని రాసిచ్చేందుకు సిద్ధమైన తండ్రి

TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే..

Arunachalam Tour : ఈ నెలలో 'అరుణాచలం' ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? రూ. 7500కే 4 రోజుల టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

TS Model School Results : తెలంగాణ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల - ఈ డైరెక్ట్ లింక్ తో ర్యాంక్ చెక్ చేసుకోండి

మల్లారెడ్డి నివాసాలు, విద్యాసంస్థల్లో హైదరాబాద్‌లోని ఆయన బంధువులు, స్నేహితులపై రెండు రోజులుగా ఆదాయపన్ను శాఖ అధికారులు చేపట్టిన దాడులు గురువారం తెల్లవారుజామున ముగిశాయి. అయితే హైదరాబాదులో భారీ డ్రామా నెలకొంది. బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో మంత్రి, ఐటీ శాఖ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. బుధవారం అర్ధరాత్రి, ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేసి.. హైదరాబాద్ శివార్లలోని సూరారంలోని ఆసుపత్రిలో ఛాతి నొప్పితో చికిత్స పొందుతున్న మంత్రి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి నుండి సంతకాలు తీసుకున్నారు.

ఈ సమయంలో మల్లారెడ్డి IT అధికారులను ప్రతిఘటించారు. సీనియర్ అధికారి రత్నాకర్‌ను తన కారులోకి ఎక్కించుకుని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ సమయంలో అధికారి నుండి మంత్రి ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారులకు రక్షణ కల్పిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని మంత్రి అనుచరులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.

తన కుమారుడిని దారుణంగా కొట్టారని, అతనితో అసభ్యంగా ప్రవర్తించారని ఐటీ అధికారులపై మల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐటీ డిపార్ట్‌మెంట్‌ వ్యక్తులు కొన్ని పత్రాలపై తన కుమారుడి నుంచి బలవంతంగా సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. తన వద్ద లెక్కల్లో చూపని డబ్బు ఏదీ లేదని, అంతా పారదర్శకంగా ఉందన్నారు. ఐటీ అధికారులు తమను వేధిస్తున్నారని, తప్పుడు వివరాలన్నింటినీ రికార్డుల్లో నమోదు చేస్తున్నారని మల్లారెడ్డి అన్నారు.

అధికారి రత్నాకర్ కొన్ని పత్రాలపై బలవంతంగా సంతకాలు తీసుకున్నారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసినట్లు బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె.రవికుమార్ తెలిపారు. 'అధికారి రత్నాకర్ కూడా మంత్రిపై ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డి, అతని అనుచరులు తనను బెదిరించారని, తన విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.' అని ఎస్సై తెలిపారు. మల్లారెడ్డి ఫిర్యాదు, ఐటీ అధికారి ఫిర్యాదులను దుండిగల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. .

ఈ దాడుల్లో మల్లారెడ్డికి చెందిన సంస్థల్లో రూ.15 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు వెల్లడించారు. కీలక పలు పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. మంత్రితోపాటుగా ఆయన బంధువులకు సమన్లు జారీ చేశారు. ఈ నెల 28, 29 తేదీల్లో హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు వెళ్లాయి. మేనేజ్‌మెంట్ కోటా కింద విద్యార్థుల నుంచి అనధికారికంగా భారీ మొత్తంలో ఫీజు వసూలు చేసినందుకు సంబంధించిన కొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

టాపిక్