MMTS Special Trains : గణేష్ నిమజ్జనం కోసం ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు
08 September 2022, 15:33 IST
- South Central Railway : గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల మధ్య ఎనిమిది MMTS ప్రత్యేక రైళ్లను నడపనుంది.
ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు
MMTS Special Trains : భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనానికి అంతా ఏర్పాట్లు అయ్యాయి. భక్తుల రద్దీ విపరీతంగా ఉండనుంది. ఈ కారణంగా ఎనిమిది ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లను నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి శనివారం సాయంత్రం 4 గంటల వరకు నడుస్తాయి.
శుక్రవారం మరియు శనివారం మధ్య రాత్రులలో నడిచే ఎనిమిది MMTS ప్రత్యేక రైళ్ల షెడ్యూల్:
సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్లే జీఎస్హెచ్-1 రైలు శుక్రవారం రాత్రి 11.30 గంటలకు బయలుదేరి 12.05 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
హైదరాబాద్ నుండి లింగంపల్లికి వెళ్లే రైలు నెం-జీహెచ్ఎల్-2 శనివారం అర్ధరాత్రి 12.30 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 1.20 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది.
రైలు నెం-GLH-3 లింగంపల్లి నుండి హైదరాబాద్కు శనివారం తెల్లవారుజామున 1.50 గంటలకు బయలుదేరి 2.40 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
రైలు నెం-జీహెచ్ఎస్-4 హైదరాబాద్-సికింద్రాబాద్ శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 4 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
రైలు నెం-జీహెచ్ఎల్-5 హైదరాబాద్-లింగంపల్లి శుక్రవారం రాత్రి 11 గంటలకు బయలుదేరి రాత్రి 11.50 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది.
రైలు నెం-GLF-6 లింగంపల్లి-ఫలక్నుమా శనివారం అర్ధరాత్రి 12.10 గంటలకు బయలుదేరి 1.50 గంటలకు ఫలక్నుమా చేరుకుంటుంది.
రైలు నెం-జీఎఫ్ఎస్-7 ఫలక్నుమా-సికింద్రాబాద్లో శనివారం తెల్లవారుజామున 2.20 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 3 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
రైలు నెం-GSH-8 సికింద్రాబాద్-హైదరాబాద్ శనివారం ఉదయం 4 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి తెల్లవారుజామున 4.40 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
South Central Railway Special Trains Latest: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా మరికొన్నింటిని ప్రకటించింది. ఇందులో భాగంగా యశ్వంతపూర్, నర్సాపూర్ కు స్పెషల్ ట్రైన్ ను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.
narasapur yesvantpur trains: నర్సాపూర్ - యశ్వంతపూర్ మధ్య ప్రత్యేక రైలును ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. సెప్టెంబర్ 9, 11వ తేదీల్లో నర్సాపూర్ నుంచి 03.20 గంటలకు బయల్దేరుతుంది. ఆయా తేదీల మరునాడు ఉదయం 10.50 గంటలకు యశ్వంతపూర్ కు చేరుకుంటుంది.
yesvantpur narasapur special trains: ఇక యశ్వంతపూర్ నుంచి సెప్టెంబర్ 10, 12 తేదీల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరుతుంది. ఆయా తేదీల మరునాడు ఉదయం 8.30 గంటలకు నర్సాపూర్ కు చేరుకుంటుంది.