తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bharat Jodo Yatra In Hyderabad : రాహుల్ జోడో యాత్ర.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Bharat Jodo Yatra In Hyderabad : రాహుల్ జోడో యాత్ర.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

HT Telugu Desk HT Telugu

01 November 2022, 14:43 IST

    • Rahul Gandhi Bharat Jodo Yatra : హైదారాబాద్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు.. పలు ఏరియాల్లో ఆంక్షలు విధించారు.
భారత్ జోడో యాత్ర
భారత్ జోడో యాత్ర (twitter)

భారత్ జోడో యాత్ర

మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య పలు రూట్రలో 3 కిలోమీటర్ల పరిధిలోని అన్ని రహదారులను నివారించాలని సూచించామని జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) ఏవీ రంగనాథ్ తెలిపారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) శంషాబాద్ నుంచి చార్మినార్(Charminar), నెక్లెస్ రోడ్డు మీదుగా రానుంది. మంగళవారం హైదరాబాద్ భారీ ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. ఉదయం 6 గంటలకు శంషాబాద్‌లోని తొండుపల్లి నుంచి ఆరామ్‌ఘర్‌, నేషనల్‌ పోలీస్‌ అకాడమీ, హసన్‌నగర్‌, లెగసీ ఫంక్షన్‌ హాల్‌ మీదుగా మధ్యాహ్నం 3 గంటలకు చార్మినార్‌కు చేరుకుంటారు. సాయంత్రం నెక్లెస్‌ రోడ్డులో జరిగే భారీ బహిరంగ సభకు హాజరవుతారు. రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు(Traffic Restrictions) అమలులో ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

TS AP Rains : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు-పిడుగుపాటు హెచ్చరికలు జారీ

Hyderabad Pub : యువతులతో అసభ్యకర డ్యాన్సులు, ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసుల దాడులు

మరోవైపు సైబరాబాద్ పోలీసులు(Cyberabad Police) కూడా బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చే ట్రాఫిక్‌కు తొండుపల్లి టోల్‌గేట్ వద్ద ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు. వాహనాలను గగన్‌పహాడ్ మీదుగా నగరానికి మళ్లిస్తారు. ఉదయం శంషాబాద్‌లోని మఠం ఆలయం నుంచి బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధికి చేరుకుని లెగసీ ఫంక్షన్‌ హాల్‌ జంక్షన్‌, బహదూర్‌పురా క్రాస్‌రోడ్‌, పురానా పుల్‌ మీదుగా చార్మినార్‌కు చేరుకుని అక్కడి నుంచి నెక్లెస్‌ రోడ్డుకు వస్తారు. సాయంత్రం 4.30 గంటలకు చార్మినార్‌లో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.

రూట్ మ్యాప్(Route Map) ప్రకారం, యాత్ర హుస్సేనియాలం, చార్మినార్, మదీనా సర్కిల్, అఫ్జల్‌గంజ్, మోహంజాహీ మార్కెట్, గాంధీభవన్, నాంపల్లి, పబ్లిక్ గార్డెన్, అసెంబ్లీ, రవీంద్ర భారతి(Ravindra Bharathi), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇక్బాల్ మినార్ రోటరీ, నుండి సుమారు 8 కి.మీ ఉంటుంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ జంక్షన్, ఎన్టీఆర్ గార్డెన్ నుండి ఇందిరా గాంధీ విగ్రహం, IMAX సర్కిల్ వరకు ఉంటుంది. దీంతో నగరంలో ట్రాఫిక్‌ స్తంభించి, ముఖ్యమైన జంక్షన్లలో వాహనాల రాకపోకలను మళ్లించే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల మధ్య, మార్చ్ రూట్‌లోని 3 కిలోమీటర్ల పరిధిలోని అన్ని రహదారులను నివారించాలని సూచించామని జాయింట్ పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) AV రంగనాథ్ తెలిపారు.

రాహుల్ యాత్ర(Rahul Yatra)ను దృష్టిలో పెట్టుకుని.. సికింద్రాబాద్‌ నుంచి కోటి, అఫ్జల్ గంజ్‌ నుంచి సికింద్రాబాద్‌, మైత్రీవనం నుంచి ఎంజీబీఎస్‌, చార్మినార్‌ నుంచి నెక్లెస్‌ రోడ్‌ మొదలైన ప్రభుత్వ బస్సులను యాత్ర రూట్‌ను తప్పించేందుకు మళ్లిస్తారు. ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు హైదరాబాద్‌ మెట్రో లేదా ఎంఎంటీఎస్‌ రైళ్లను ఉపయోగించాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ప్రజలకు అధికారులు సూచించారు.