తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay| ఆ విషయాన్ని డైవర్ట్ చేసేందుకే టీఆర్ఎస్ నిరసనలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యల్లో తప్పేముంది?

Bandi Sanjay| ఆ విషయాన్ని డైవర్ట్ చేసేందుకే టీఆర్ఎస్ నిరసనలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యల్లో తప్పేముంది?

HT Telugu Desk HT Telugu

09 February 2022, 12:21 IST

  • రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుందని ఎంబీ బండి సంజయ్ అన్నారు. ఈ చర్చను డైవర్ట్ చేసేందుకే.. టీఆర్ఎస్ నేతల నిరసనలు అని ఆరోపించారు. కావాలనే డ్రామాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

బండి సంజయ్(ఫైల్ ఫొటో)
బండి సంజయ్(ఫైల్ ఫొటో) (facebook)

బండి సంజయ్(ఫైల్ ఫొటో)

చరిత్రను నాశనం చేసేందుకే సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. సీఎం చేస్తున్న కుట్రలను ఎండగట్టేందుకే బీజేపీ చేస్తున్న పోరాటాలపై ప్రజల్లో చర్చ జరగకుండా టీఆర్ఎస్ చేస్తున్న డ్రామాలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో తెలంగాణ ఎంపీలు సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, పార్టీ నేతలు వీరేందర్ గౌడ్, అందెల శ్రీరాములు యాదవ్, నర్సింహారెడ్డి తదితరులతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

ట్రెండింగ్ వార్తలు

Rythu Bharosa Funds : రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, రైతు భరోసా నిధులు విడుదల

Plantix App: మూడు కోట్ల మంది రైతులు ఉపయోగిస్తున్న ప్లాంటిక్స్ యాప్… రైతుల మన్నన పొందుతున్న అప్లికేషన్

Mlc Kavitha Bail Petitions : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్, బెయిల్ నిరాకరించిన కోర్టు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది? ఆయన దిష్టిబొమ్మలను ఎందుకు దగ్దం చేస్తున్నారో టీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. మోడీ తెలంగాణను వ్యతిరేకించారా? బిల్లు వద్దన్నరా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ ఈ దేశానికి చేసిన ఇబ్బందులను మాత్రమే ప్రస్తావించారు కదా అని చెప్పారు. కాంగ్రెస్ విధానాన్ని ఎండగడితే కేసీఆర్, టీఆర్ఎస్ నేతలకు ఏమైందని అడిగారు. తెలంగాణ సమాజానికి కేసీఆర్ సీఎంగా కొనసాగడం అరిష్టమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని మొట్టమొదట కాకినాడ తీర్మాం చేసింది బీజేపీ మాత్రమేనని తెలిపారు.

'2000 సంవత్సరంలో బీజేపీకి సంఖ్యాబలం లేనందునే తెలంగాణ ఇవ్వలేకపోయాం. ఎన్డీఏ ఛైర్మన్ గా చంద్రబాబు అడ్డుకున్నందునే తెలంగాణ ఇవ్వలేకపోయాం. ఆనాడు ఎక్కడా గొడవ జరగలేదు.. పార్లమెంట్ లో తలుపులు మూసి, మైక్ కట్ చేయలేదు. చర్చ జరిపి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశాం. తెలంగాణ బిల్లు సమయంలో పెప్పర్ స్ప్రే పార్లమెంట్ కొట్టించింది కాంగ్రెస్ నేతలే కదా. పెప్పర్ స్ర్పే కొట్టి ఎంపీలను ఇబ్బంది పెట్టినా ఎదురొడ్డి తెలంగాణ బిల్లు పెట్టేలా చేసి మద్దతిచ్చింది సుష్మా స్వరాజ్. పార్లమెంట్ లో మీరు బిల్లు పెట్టకుంటే... మేం వచ్చాక బిల్లు పెడతామని హెచ్చరిస్తే కాంగ్రెస్ భయపడి తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సంగతి మర్చిపోయరా?' అని బండి సంజయ్ ప్రశ్నించారు.

పార్లమెంట్ లో బిల్లు పెట్టేటప్పుడు ఓటింగ్ లో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదు. ఢిల్లీలో 48 గంటల దీక్ష అని చెప్పి దొంగ దీక్ష చేసింది నువ్వు కాదా? కేసీఆర్... ఉద్యమ ద్రోహులను పక్కన చేర్చుకుంది నిజం కాదా? నీ కేబినెట్ లో ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులున్నరో చెప్పగలవా? బలిదానాలు చేసిన శ్రీకాంతాచారిసహా అమరవీరుల ఆత్మఘోష వినిపిస్తలేదా? తెలంగాణ ఉద్యమ కారులు నీ ద్రోహాన్ని ఎండగట్టేందుకు బీజేపీలో చేరుతున్న విషయం మీకు తెల్వదా? తెలంగాణలో ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులను ఇబ్బంది పెడుతున్నారు. క్రృష్ణా నీటిని ఏపీకి తరలించుకుపోతుంటే కనీసం స్పందించకుండా ఫామ్ హౌజ్ కే పరిమితమైన కేసీఆర్ బీజేపీని విమర్శించే నైతిక హక్కుందా? ప్రజా సమస్యలను దారి మళ్లించడానికి రోజుకో కొత్త డ్రామాలాడుతున్నారు కేసీఆర్. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ... టీఆర్ఎస్ పతనం ఎప్పుడో ఖరారైంది.

                                         - బండి సంజయ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు