తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Coastal Karnataka Tour : హైదరాబాద్ టూ కోస్టల్ కర్ణాటక టూర్ ప్యాకేజీ ఇదే

IRCTC Coastal Karnataka Tour : హైదరాబాద్ టూ కోస్టల్ కర్ణాటక టూర్ ప్యాకేజీ ఇదే

HT Telugu Desk HT Telugu

14 November 2022, 22:43 IST

    • Hyderabad To Coastal Karnataka Tour Package : హైదరాబాద్ నుంచి కర్ణాటక టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది.
కర్ణాటక టూర్ ప్యాకేజీ
కర్ణాటక టూర్ ప్యాకేజీ

కర్ణాటక టూర్ ప్యాకేజీ

IRCTC Coastal Karnataka Tour Package : వివిధ ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి కర్ణాటక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. Coastal Karnataka పేరుతో ఈ ప్యాకేజీని అందుబాటులో ఉంది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో పలు పర్యాటక ప్రాంతాలను చూపిస్తారు. ఉడిపి, శృంగేరి, మురుదేశ్వర్ వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. నవంబర్ 22న టూర్ అందుబాటులో ఉంది. 6 రోజులు 5 రాత్రులు టూర్ ప్యాకేజీ ఇది.

ట్రెండింగ్ వార్తలు

Siddipet Accident : పెళ్లి రోజే విషాదం, రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Youth Cheated Producer : ఒక్క ఛాన్స్ అంటూ నిర్మాత చుట్టూ ప్రదక్షిణాలు, అవకాశం చిక్కగానే బంగారంతో జంప్

Cyber Crime : ప్రముఖ కంపెనీలో ఉద్యోగం, సిద్దిపేట యువతికి రూ.16 లక్షలు టోకరా - ఏపీలో సైబర్ కేటుగాడు అరెస్ట్

Mlc Dande Vithal : ఎమ్మెల్సీగా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు, సుప్రీంలో సవాల్ చేస్తానంటోన్న దండే విఠల్

నవంబర్ 22న టూర్ ప్రారంభం అవుతుంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. మెుదటిరోజు కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 06.05 ట్రైన్ బయల్దేరుతుంది. రెండో రోజు ఉదయం 09.30 గంటలకు మంగళూరు సెంట్రల్ స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడ్నుంచి ఉడిపికి చేరుకుంటారు. హోటల్ లో చెకిన్ అయిన తర్వాత శ్రీకృష్ణ ఆలయం, సెయింట్ మేరీ ఐల్యాండ్, మల్పే బీచ్ సందర్శిస్తారు. రాత్రి ఉడిపిలోనే బస చేస్తారు.

మూడో రోజు ఉడిపి నుంచి శృంగేరికి బయల్దేరారు. శారదంబ ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం కొల్లూరు, ముకాంబికా ఆలయాలకు వెళ్తారు. ఆ తర్వాత మురుదేశ్వర్ కు చేరుకుంటారు. నాలుగో రోజు ఉదయమే ఆలయ సందర్శన ఉంటుంది. అక్కడ్నుంచి జోగ్ వాటర్ ఫాల్స్ కు వెళ్తారు. మధ్యాహ్నం గోకర్నా సందర్శన తర్వాత... తిరిగి మురుదేశ్వర్ కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఐదో రోజు మంగళూరుకు చేరుకుంటారు. కటీల్, మంగలా ఆలయాలను దర్శించుకుంటారు. రాత్రి 7 గంటల వరకు మంగళూరు సెంట్రల్ కు చేరుకొని హైదరాబాద్ కు తిరుగు పయనం అవుతారు. ఆరో రోజు రాత్రి 11.40 గంటలకు కాచిగూడకు చేరుకోవటం టూర్ ముగుస్తుంది.

సింగిల్ షేరింగ్ కు 34,270 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 19570 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు 15,480గా ఉంది. టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించొచ్చు.