తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Kcr | ముంబై పర్యటనకు బయలుదేరిన సీఎం కేసీఆర్‌

CM KCR | ముంబై పర్యటనకు బయలుదేరిన సీఎం కేసీఆర్‌

HT Telugu Desk HT Telugu

20 February 2022, 12:21 IST

    • ముంబై పర్యటనలో భాగంగా ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రేతోపాటు ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌తోనూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ కానున్నారు.
ప్రత్యేక విమానంలో ఎంపీ రంజిత్ రెడ్డితో సీఎం కేసీఆర్
ప్రత్యేక విమానంలో ఎంపీ రంజిత్ రెడ్డితో సీఎం కేసీఆర్

ప్రత్యేక విమానంలో ఎంపీ రంజిత్ రెడ్డితో సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ఆదివారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ముంబై బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట ఎంపీలు సంతోష్‌కుమార్‌, రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్‌రెడ్డి టీఆర్ఎస్‌ ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌కుమార్‌ రెడ్డి ఉన్నారు. 

ట్రెండింగ్ వార్తలు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

TS AP Rains : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు-పిడుగుపాటు హెచ్చరికలు జారీ

Hyderabad Pub : యువతులతో అసభ్యకర డ్యాన్సులు, ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసుల దాడులు

ఈ పర్యటనలో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రేతోపాటు నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌తోనూ సీఎం కేసీఆర్‌ భేటీ కానున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత, భవిష్యత్‌ రాజకీయ పరిణామాలపై వారితో చర్చించనున్నారు. సీఎం రాకను పురస్కరించుకొని శనివారమే ముంబై నగరంలో పెద్ద ఎత్తున కేసీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దేశ్ కీ నేతా అంటూ కేసీఆర్ తోపాటు ఆయనకు మద్దతుగా నిలిచిన నేతల ఫొటోలను ఈ ఫ్లెక్సీల్లో ఉంచారు.