తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay : ఎంఐఎం అంటే కేసీఆర్ కు భయం అంటున్న బండి సంజయ్

Bandi Sanjay : ఎంఐఎం అంటే కేసీఆర్ కు భయం అంటున్న బండి సంజయ్

HT Telugu Desk HT Telugu

03 September 2022, 11:54 IST

    • తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడానికి ఎంఐఎం అంటే కేసీఆర్‌కు ఉన్న భయమే కారణమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. 
ఎంఐఎం అంటే కేసీఆర్‌కు భయమంటున్న బండి సంజయ్
ఎంఐఎం అంటే కేసీఆర్‌కు భయమంటున్న బండి సంజయ్ (twitter)

ఎంఐఎం అంటే కేసీఆర్‌కు భయమంటున్న బండి సంజయ్

ఎంఐఎం పార్టీ అంటే ఉన్న భయం వల్లే తెలంగాణ విమోచన దినం నిర్వహించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఇచ్చిన మాట తప్పి తెలంగాణ అమరులను అవమానిస్తున్న దుర్మార్గుడు కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘విమోచన దినం’ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నది బీజేపీ మాత్రమేనన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Rythu Bharosa Funds : రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, రైతు భరోసా నిధులు విడుదల

Plantix App: మూడు కోట్ల మంది రైతులు ఉపయోగిస్తున్న ప్లాంటిక్స్ యాప్… రైతుల మన్నన పొందుతున్న అప్లికేషన్

Mlc Kavitha Bail Petitions : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్, బెయిల్ నిరాకరించిన కోర్టు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

తెలంగాణ విలీన వజ్రోత్సవాల పేరిట కేసీఆర్ మరో జిమ్మిక్కుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ నిఖార్సైన తెలంగాణ వాది అయితే తక్షణమే విమోచనోత్సవాలు నిర్వహించాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏటా విమోచన దినోత్సవాలు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అమర వీరులను ఘోరంగా అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్, సీఎం పీఠమెక్కినాక ఆ అవసరమే లేదంటూ మాట తప్పడం దుర్మార్గమన్నారు.

తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించకపోవడానికి అసలు కారణమేంటో రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం పార్టీకి భయపడి సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహించకపోవడం సిగ్గు చేటని, తెలంగాణ విలీన వజ్రోత్సవాల పేరిట కేసీఆర్ మరో నాటకానికి తెరతీశారని ఆరోపించారు. కేసీఆర్ నిఖార్సైన తెలంగాణవాది అయితే గతంలో ఇచ్చిన మాట మేరకు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి తీరాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలంటూ అనేక ఏళ్లుగా రాజీలేని పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు కేంద్ర పర్యాటక, సాంస్క్రుతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సమీక్ష చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించి తీరుతామన్నారు.

టాపిక్