తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Baby Ponds For Immersing Ganesha Idols: బేబీ పాండ్స్‌తో గణేష్ నిమజ్జనం ఇక సులువు

Baby ponds for immersing Ganesha idols: బేబీ పాండ్స్‌తో గణేష్ నిమజ్జనం ఇక సులువు

HT Telugu Desk HT Telugu

08 September 2022, 11:08 IST

  • Baby ponds for immersing Ganesha idols in hyderabad: సమీపంలోని చెరువుల్లో అందంగా ముస్తాబుచేసిన బేబీ పాండ్స్ ఇప్పుడు గణేష్ నిమజ్జనానికి అత్యంత సౌకర్యవంతంగా ఉన్నాయి.

ఆల్వాల్ చెరువులో అంతర్భాగంగా నిర్మించిన బేబీ పాండ్‌లో గణేష్ విగ్రహ నిమజ్జనం
ఆల్వాల్ చెరువులో అంతర్భాగంగా నిర్మించిన బేబీ పాండ్‌లో గణేష్ విగ్రహ నిమజ్జనం

ఆల్వాల్ చెరువులో అంతర్భాగంగా నిర్మించిన బేబీ పాండ్‌లో గణేష్ విగ్రహ నిమజ్జనం

హైదరాబాద్, సెప్టెంబర్ 8: గణేశ విగ్రహాల నిమజ్జనం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) గణేశ విగ్రహాల నిమజ్జనం కోసం కృత్రిమ బేబీ పాండ్స్ (చిన్న నీటి కొలనులు) ఏర్పాటు చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Rythu Bharosa Funds : రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, రైతు భరోసా నిధులు విడుదల

Plantix App: మూడు కోట్ల మంది రైతులు ఉపయోగిస్తున్న ప్లాంటిక్స్ యాప్… రైతుల మన్నన పొందుతున్న అప్లికేషన్

Mlc Kavitha Bail Petitions : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్, బెయిల్ నిరాకరించిన కోర్టు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

జూబ్లీహిల్స్ సర్కిల్‌లో రెండు, ఎన్‌బీటీ నగర్‌లో ఒకటి, షేక్‌పేట్ మారుతీ నగర్‌లో రెండు చెరువులను ఏర్పాటు చేసినట్లు జీహెచ్‌ఎంసీ బేబీ పాండ్స్ నోడల్ అధికారి అబ్దుల్ ఖయూమ్ తెలిపారు.

‘మట్టి గణేష్ విగ్రహాలను ప్రతిష్టించడానికి ఇంటింటికీ అవగాహన కల్పించాం. దానికి మంచి స్పందన వచ్చింది. చాలా దూరంలో ఉన్న ట్యాంక్ బండ్‌కు వెళ్లడం సమస్య కాబట్టి సమీప ప్రాంతాల్లో చెరువుల పక్కన బేబీ పాండ్స్ నిర్మించాం..’ అని నోడల్ అధికారి తెలిపారు.

నిమజ్జనం తర్వాత పూజా సామాగ్రి వేరు చేసి ప్రత్యేక కుండీల్లో వేస్తాం. ప్రస్తుతం షిఫ్టులో దాదాపు 65 నుంచి 75 విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. చెరువును శుభ్రం చేసేందుకు పారిశుధ్య సిబ్బందిని నియమించాం. భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు. సమీప ప్రాంతాలలో బేబీ పాండ్‌లను కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు’ అని నోడల్ అధికారి తెలిపారు.

గోల్కొండ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో దాదాపు 115 గణేష్ విగ్రహాలు ఉన్నాయని, వాటిని 6 సెక్టార్‌లుగా విభజించామని తెలిపారు.

సబ్ ఇన్‌స్పెక్టర్, సబార్డినేట్ బృందంతో కూడిన మొత్తం ప్రాంతాన్ని ఆరు సెక్టార్‌లుగా విభజించారు. భక్తులు ఈ చిన్న కొలనుల్లో విగ్రహాలను నిమజ్జనం చేయాలని కోరారు. 5 అడుగుల లోపు విగ్రహాలను మాత్రమే అనుమతిస్తారు. భక్తులను చెరువుల వద్దకు చేర్చేందుకు ఒక పోలీసు బృందం ఉంటుంది. తప్పిపోయే అవకాశం ఉన్నందున ఊరేగింపులో పిల్లలను తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం..’ అని రెడ్డి తెలిపారు.

సైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నెక్నంపూర్ బేబీ పాండ్, మల్కం చెరువు బేబీ పాండ్‌లో 5-10 అడుగుల మధ్య విగ్రహాలను నిమజ్జనం చేయాలని, 10 అడుగులకు పైబడిన విగ్రహాలను జియాగూడ నిమజ్జన కేంద్రంలో నిమజ్జనం చేయాలని ప్రజలకు సూచించాం..’ అని ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఈ ఆలోచనతో చాలా సంతృప్తి చెందారని వివరించారు.

<p>ఓల్డ్ ఆల్వాల్ నారాయాణాద్రి రెసిడెన్సీ సొసైటీ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన వేడుకలు</p>

‘బేబీ పాండ్స్ ఎప్పుడో కట్టి ఉండాల్సింది. ఈ సంవత్సరం వాటిని ఏర్పాటు చేశారు. ఇది మాకు చాలా సౌకర్యవంతంగా ఉంది. ఇంతకు ముందు, పిల్లలతో చాలా దూరం వెళ్ళడం చాలా కష్టమయ్యేది. కానీ ఇప్పుడు విగ్రహాలను సులభంగా తీసుకురావొచ్చు..’ అని ఓల్డ్ ఆల్వాల్‌లోని నారాయణాద్రి రెసిడెన్సీ సొసైటీ ప్రతినిధులు ప్రణీత్ రావు, మనోహర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

టాపిక్