తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Pitru Paksha 2022:పితృ పక్షం సమయంలో పొరపాటున కూడా ఇలా చేయకండి..ఆశుభం కలుగుతుంది!

Pitru Paksha 2022:పితృ పక్షం సమయంలో పొరపాటున కూడా ఇలా చేయకండి..ఆశుభం కలుగుతుంది!

HT Telugu Desk HT Telugu

10 September 2022, 22:37 IST

    • Pitru Paksha shradh 2022 niyam rules: భాద్రపద పౌర్ణమి   కృష్ణ పక్షంలోని ప్రతిపదాన్ని పితృ పక్షం అంటారు. ఈ సమయంలో, పూర్వీకుల ఆత్మల శాంతి కోసం శ్రాద్ కూడా నిర్వహిస్తారు.
Pitru Paksha shradh 2022
Pitru Paksha shradh 2022

Pitru Paksha shradh 2022

భాద్రపద పూర్ణిమ, ఆశ్విన్ మాసంలోని కృష్ణ పక్షంలో ప్రతిపద పితృ పక్షం మెుదలవుతుంది. ఈ సమయంలో, పూర్వీకుల ఆత్మల శాంతి కోసం శ్రాద్ కూడా నిర్వహిస్తారు. పితృ పక్షం సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 25 వరకు కొనసాగుతుంది. బ్రహ్మ పురాణం ప్రకారం పితృదేవతలను పూజించి నైవేద్యంగా సమర్పించాలి. శ్రాద్ధం ద్వారా పూర్వీకుల రుణం తీర్చుకోవచ్చు. పితృ పక్షంలో శ్రాద్ధం చేయడం ద్వారా పూర్వీకులు సంతోషిస్తారు. పితృ పక్షంలో పూర్వీకుల ఆత్మ శాంతి కోసం తర్పణం లేదా పిండ దానం నిర్వహిస్తారు.

లేటెస్ట్ ఫోటోలు

మే 9, రేపటి రాశి ఫలాలు.. రేపు మీ ఇంట శుభకార్యాలు జరగడంతో బిజిబిజీగా ఉంటారు

May 08, 2024, 08:33 PM

Sun Nakshatra transit: సూర్యుడి నక్షత్ర మార్పుతో అదృష్టం పొందబోయే రాశులు ఇవే.. వీరికి కనక వర్షమే

May 08, 2024, 03:05 PM

Trigrahi Yogas: ఒకటి రెండు కాదు 3 త్రిగ్రాహి యోగాలు.. ఈ రాశుల వారిది మామూలు అదృష్టం కాదండోయ్

May 08, 2024, 10:44 AM

మే 8, రేపటి రాశి ఫలాలు.. కొత్తగా వ్యాపారాన్ని చేపట్టాలనుకునే వారి కోరిక తీరుతుంది

May 07, 2024, 08:45 PM

Mars Transit : కుజుడి దయతో ఈ రాశులవారి జీవితాల్లో అద్భుతాలు.. విక్టరీ మీ సొంతం

May 07, 2024, 04:07 PM

Shukraditya Raja yogam 2024: శుక్రాదిత్య రాజయోగం: ఈ రాశుల వారికి ఆదాయం పెరుగుదలతో పాటు చాలా లాభాలు

May 07, 2024, 03:43 PM

పండిట్ విజయ్ కుమార్ ప్రకారం శ్రద్ధ పక్ష సమయంలో ఏదైనా శుభకార్యాలు చేయడం మంచి కాదని భావిస్తారు. ఈ రోజుల్లో కొత్త వస్తువులు కొనకూడదు. అలాగే ఈ సమయంలోనే సాత్విక ఆహారాన్ని మాత్రం తీసుకోవాలి. తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. శ్రద్ధా సమయంలో ఐరన్ పాత్రలలో ఆహారాన్ని వండటం మానుకోవాలి. పితృ పక్షంలో వంటలకు ఇత్తడి, రాగి లేదా ఇతర లోహ పాత్రలను ఉపయోగించాలి. అంతే కాకుండా ఈ సమయంలో జుట్టు, గడ్డం కత్తిరించకూడదు. జుట్టు, గడ్డం కత్తిరించడం ద్వారా ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. శ్రాద్ధ పక్షంలో వెల్లుల్లి, ఉల్లిపాయలతో చేసిన ఆహారాన్ని తినకూడదు.

పితృ పక్షంలో పౌర్ణమి నుండి అమావాస్య వరకు సాయంత్రం దక్షిణ ముఖంగా ఆవనూనె లేదా ఆవు నెయ్యి దీపం వెలిగించండి.

పితృ పక్షం నాడు, ప్రతిరోజు పూర్వీకులకు తర్పణం చేయండి లేదా బ్రాహ్మణుని చేత చేయించండి.

- పితృ పక్షంలో ప్రతిరోజూ పితృ గాయత్రీ మంత్రాన్ని జపించండి, మీరు పితృ దోషం నుండి విముక్తి పొందుతారు.

ప్రతి శ్రాద్ధ రోజున, బ్రాహ్మణులకు లేదా పేదలకు వీలైనంత వరకు అన్నదానం చేయండి. ఎక్కువ దక్షిణ ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి.

ఆవు, కుక్క, చీమలు, కాకి కూడా ప్రతి శ్రాద్ధ రోజున ఆహారం ఇవ్వాలి.

పితృ పక్షంలో పూర్వీకుల ఆశీస్సులను పొందడానికి, శ్రీ మద్ భగవత్ మహాపురాణం అసలు వచనాన్ని చదవండి.

పితృ పక్షంలో పూర్వీకుల ఆశీర్వాదం పొందడానికి, బ్రహ్మ గాయత్రీ మంత్రాన్ని కూడా పఠించాలి.

సర్వ పితృ అమావాస్య రోజున బ్రాహ్మణులు శ్రాద్ధం చేయడం మంచిది.

పూర్వీకుల సంతోషం కోసం ప్రతినెలా అమావాస్య రోజు సూర్యాస్తమయ సమయంలో ఆవనూనె దీపం వెలిగించాలి.