తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  అపర ఏకాదశి వ్రత కథ.. ఉపవాస ఫలం పొందేందుకు ఈ కథ తప్పక తెలుసుకోండి

అపర ఏకాదశి వ్రత కథ.. ఉపవాస ఫలం పొందేందుకు ఈ కథ తప్పక తెలుసుకోండి

HT Telugu Desk HT Telugu

15 May 2023, 14:31 IST

    • అపర ఏకాదశి వ్రత కథ: అపర ఏకాదశి రోజున ఈ కథ చదవడం వల్ల ఉపవాస ఫలం లభిస్తుంది. 
ఏకాదశి రోజున విష్ణు మూర్తిని పూజించాలి
ఏకాదశి రోజున విష్ణు మూర్తిని పూజించాలి

ఏకాదశి రోజున విష్ణు మూర్తిని పూజించాలి

అపర ఏకాదశి జ్యేష్ట మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి. ఈరోజు మే 15న అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఏకాదశి తిథి ప్రతినెలా రెండుసార్లు వస్తుంది. ఒకటి కృష్ణపక్షంలో, మరొకటి శుక్లపక్షంలో వస్తుంది. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశి తిథులు వస్తాయి. అపర ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈరోజు తప్పక ఒక కథను చదవాలి. ఈ వ్రత కథ చదవడం వల్ల ఉపవాసం వల్ల ప్రయోజనం కలుగుతుంది.

లేటెస్ట్ ఫోటోలు

ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి! ఆరోగ్య సమస్యలు- భారీ డబ్బు నష్టం..

May 05, 2024, 04:07 PM

Bad Luck Rasi : ఈ రాశులవారికి కష్టకాలం, ధన నష్టం జరిగే అవకాశం.. జాగ్రత్త

May 05, 2024, 08:38 AM

అదృష్టం అంతా ఈ రాశుల వారిదే.. భారీ ధన లాభం, ఉద్యోగంలో ప్రమోషన్​!

May 04, 2024, 01:28 PM

Lord Mars : కుజుడి కారణంగా ఈ రాశులవారు అన్ని విషయాల్లో జాగ్రత్త

May 04, 2024, 08:26 AM

ఈ రాశుల వారికి కష్ట కాలం.. డబ్బు నష్టం- ఎంత కష్టపడినా దక్కని ఫలితం!

May 04, 2024, 05:51 AM

మే 4, రేపటి రాశి ఫలాలు.. రేపు మేష రాశి నుంచి మీన రాశి వారికి ఎలా గడుస్తుందంటే

May 03, 2024, 08:34 PM

అపర ఏకాదశి వ్రత కథ

మహా విష్ణువు అనుగ్రహాన్ని ప్రసాదించే ఉపవాస కథ ఇది. మహిధ్వజుడు అనే నీతిమంతుడైన రాజు ఉండేవాడు. రాజు తమ్ముడు వజ్రధ్వజుడు అన్నయ్యను ద్వేషించేవాడు. ఒకరోజు అవకాశం చూసుకుని రాజును చంపి అడవిలో రావిచెట్టు కింద పూడ్చిపెడతాడు. అకాల మరణంతో రాజు ఆత్మ దెయ్యంగా మారి రావిచెట్టుపై జీవించడం ప్రారంభించింది.

ఈ మార్గంలో ప్రయాణించే ప్రతి వ్యక్తిని ఆత్మ కలవరపెడుతుంది. ఒకరోజు ఒక మహర్షి ఈ మార్గం గుండా వెళుతున్నాడు. వారు ఈ దెయ్యాన్ని చూసి అది దెయ్యంగా మారడానికి గల కారణాన్ని తమ తపోబలంతో తెలుసుకున్నారు.

మహర్షి రావిచెట్టు నుంచి రాజు ఆత్మను కిందకు దించి పరలోక విద్యను బోధించారు. రాజుకు విముక్తి కలిగించడానికి రుషి స్వయంగా అపర ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి రోజున ఉపవాసం పూర్తయిన తరువాత ఉపవాస సద్గుణాన్ని దెయ్యానికి ఇచ్చారు. ఏకాదశి వ్రతం పుణ్యం పొందిన తరువాత రాజు దెయ్యం నుంచి విముక్తి పొంది స్వర్గానికి వెళతాడు.

అంటే ఏకాదశి వ్రతం ఆచరించే వారు ఏకాదశి ఉపవాస మహత్మ్యం తెలుసుకునేందుకు ఈ కథ ఉపయోగపడుతుంది.