తెలుగు న్యూస్  /  National International  /  Two Indian Soldiers Killed, Four Injured In Operation Against Militants In Kashmir

Kashmir encounter: కశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం; ఐదుగురు జవాన్ల మృతి

HT Telugu Desk HT Telugu

05 May 2023, 14:07 IST

  • Kashmir encounter: కశ్మీర్లో శుక్రవారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్లో ఐదుగురు భారతీయ జవాన్లు మృతి చెందారు. ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆర్మీ మేజర్ ఉధంపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Kashmir encounter: కశ్మీర్లో శుక్రవారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్లో ఐదుగురు భారతీయ జవాన్లు మృతి చెందారు.ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆర్మీ మేజర్ ఉధంపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జమ్మూకశ్మీర్లోని రాజౌరీ సెక్టార్లో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Kashmir encounter: ఉగ్రవాదుల ఘాతుకం

జమ్మూకశ్మీర్లోని రాజౌరీ సెక్టార్లో ఉగ్రవాదుల కదలికలపై విశ్వసనీయ సమాచారం అందడంతో భారతీయ సైన్యం ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూంబింగ్ జరుపుతోంది. ముఖ్యంగా గత నెలలో సైనికులు వెళ్తున్న వాహనాన్ని ఉగ్రవాదులు పేల్చేయడంతో ఐదుగురు జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే. నాటి నుంచి మిలిటెంట్ల కోసం ఆర్మీ తీవ్రంగా గాలిస్తోంది. రాజౌరీ సెక్టార్లోని కంది అటవీ ప్రాంతంలోని సంక్లిష్ట పర్వత ప్రదేశంలో చిక్కుకుపోయిన కొందరు ఉగ్రవాదులు ఆర్మీ సెర్చ్ టీమ్ కు శుక్రవారం ఉదయం ఎదురయ్యారు. ఆర్మీ జవాన్లను చూడగానే ఉగ్రవాదులు వారిపై కాల్పులు ప్రారంభించారు. హ్యాండ్ గ్రెనేడ్లను, బాంబులను విసిరారు. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒక ఆఫీసర్ సహా నలుగురు సైనికులు గాయపడ్డారు. వెంటనే తేరుకున్న సైనికులు ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు ప్రారంభించారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు కూడా ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. గాయపడిన సైనికులను ఉధంపూర్ లోని ఆర్మీ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో మరో ముగ్గురు జవాన్లు చనిపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆర్మీ మేజర్ కు చికిత్స కొనసాగుతోంది. ఎన్ కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.