తెలుగు న్యూస్  /  National International  /  Sonia Gandhi To Join Rahul In Bharat Jodo Yatra On Oct 6 Priyanka To Follow Too

Sonia Gandhi to join Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొననున్న సోనియా గాంధీ

HT Telugu Desk HT Telugu

03 October 2022, 13:48 IST

    • Sonia Gandhi to join bhatat jodo Yatra: భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ పాల్గొనే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
నిన్న మైసూరులో సాగిన భారత్ జోడో యాత్ర
నిన్న మైసూరులో సాగిన భారత్ జోడో యాత్ర (PTI)

నిన్న మైసూరులో సాగిన భారత్ జోడో యాత్ర

న్యూఢిల్లీ: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అక్టోబర్ 6న కర్నాటకలోని మాండ్యా జిల్లాలో భారత్ జోడో యాత్రలో పాల్గొననున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

ట్రెండింగ్ వార్తలు

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపజేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అక్టోబరు 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా, శశిథరూర్, మల్లికార్జున్ ఖర్గే తదితర నేతలు బరిలోకి దిగారు. ఆమె సోమవారం కర్ణాటకకు బయలుదేరి మైసూరు జిల్లాకు చేరుకునే అవకాశం ఉంది. యాత్రలో చేరడానికి ముందు సోనియా గాంధీ కొడగు జిల్లా మడికేరి పట్టణంలో రెండు రోజుల పాటు బస చేయనున్నారు.

సోనియా గాంధీ యాత్రలో పాల్గొన్న ఒక రోజు తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా యాత్రలో పాల్గొననున్నారు.

ప్రియాంక గాంధీ కార్యక్రమం ఇంకా ఖరారు కాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబరు 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమై తమిళనాడు, కేరళ నుంచి ప్రయాణించి 21 రోజుల్లో 511 కిలోమీటర్ల దూరం సాగిన భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ పాల్గొనడం ఇదే తొలిసారి అవుతుంది.

సోనియా గాంధీ ఇటీవల తన వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లారు. అయితే ఈ సమయంలో ఆమె తన తల్లిని కూడా కోల్పోయారు. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ మధ్య సోనియా కుటుంబ సభ్యులు ముగ్గురూ యాత్రలో కనిపించనున్నారు. ఈసారి గాంధీ కుటుంబ సభ్యులు ఎవరూ అధ్యక్ష పదవిలో లేరు.

కాగా మైసూరులో కొనసాగుతున్న 'భారత్ జోడో యాత్ర'లో భారీ వర్షం కురుస్తుండగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బహిరంగ సభలో ప్రసంగించారు.

‘భారత్‌ను ఏకం చేయడంలో మమ్మల్ని ఎవరూ ఆపలేరు. భారతదేశం స్వరాన్ని పెంచడం నుండి మమ్మల్ని ఎవరూ ఆపలేరు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు వెళ్తాం.. భారత్ జోడో యాత్రను ఎవరూ ఆపలేరు’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

రాహుల్ గాంధీ ఉదయం 8 గంటలకు కర్ణాటకలోని ఖాదీ గ్రామోద్యోగ్‌లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రార్థనా సమావేశం నిర్వహించారు. భారత్ జోడో యాత్ర 25వ రోజున మహాత్ముడి జ్ఞాపకార్థం బద్నవాలులోని ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్‌ను సందర్శించారు.

రాహుల్ గాంధీతో పాటు పార్టీ ఎంపీలు, నేతలు, కార్యకర్తలు అందరూ భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు. కొన్ని కంటైనర్లలో స్లీపింగ్ బెడ్‌లు, టాయిలెట్లు, ఏసీలు ఏర్పాటు చేశారు. నేతలంతా ఈ కంటైనర్లలో బస చేస్తున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. రాబోయే ఎన్నికల్లో పోరాటం కోసం పార్టీ శ్రేణులు, నేతలను సమీకరించే ప్రయత్నంగా యాత్రను రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు.