తెలుగు న్యూస్  /  National International  /  Militancy At Its Lowest Ebb In J-k; Jammu Region Almost Cleared Of Menace Says Dgp

Militancy in Jammu : ఉగ్రవాద చెర నుంచి 'జమ్ము'కు విముక్తి..!

11 December 2022, 7:30 IST

  • Jammu region free of terror : జమ్ము ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు కనిష్ఠ స్థాయికి చేరాయని అధికారులు వెల్లడించారు. భద్రతా దళాలను చూసి ఉగ్రవాదులు భయపడుతున్నట్టు పేర్కొన్నారు.

ఉగ్రవాద చెర నుంచి 'జమ్ము'కు విముక్తి..!
ఉగ్రవాద చెర నుంచి 'జమ్ము'కు విముక్తి..! (PTI)

ఉగ్రవాద చెర నుంచి 'జమ్ము'కు విముక్తి..!

Militancy in Jammu : ఉగ్రవాదంతో నిత్యం అల్లాడిపోతున్న జమ్ముకశ్మీర్​లో శాంతి నెలకొంటోంది. ముఖ్యంగా జమ్ము ప్రాంతానికి.. ఉగ్రవాద చెర నుంచి దాదాపుగా విముక్తి లభించింది! ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్​ డీజీపీ దిల్బాగ్​ సింగ్​ తెలిపారు. భద్రతా దళాల దూకుడుకు.. ఉగ్రవాదులు సైతం భయపడిపోతున్నట్టు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

"లెక్కలను పరిగణలోకి తీసుకుంటే.. జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదం అనేది ఇప్పుడు కనిష్ఠ స్థాయికి పడిపోయింది. జమ్ములో ఉన్న 10జిల్లాల్లోని తొమ్మిది జిల్లాల్లో ఉగ్రవాదుల కార్యకలాపాలు లేవు. మిగిలిన ఒక జిల్లాలో.. 3,4 ఉగ్రవాదులు యాక్టివ్​గా ఉన్నారు. వారిని కూడా పట్టుకుంటాము," అని దిల్బాగ్​ సింగ్​ వెల్లడించారు.

2022లో ఉగ్రవాదంపై భద్రతా దళాలు భారీ స్థాయిలో పోరాటం చేసి విజయం సాధించినట్టు జమ్ముకశ్మీర్​ డీజీపీ స్పష్టం చేశారు. ఎవరైనా ఉగ్రవాదంలో చేరాలంటే.. ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నట్టు, ఇది భద్రతా దళాల వల్లే సాధ్యమైనట్టు వివరించారు.

Jammu region free of terror : "ఇక్కడి యువతకు మేము కౌన్సిలింగ్​ ఇస్తున్నాము. జమ్ముకశ్మీర్​లో జరుగుతున్న రక్తపాతంతో సంబరాలు చేసుకుంటున్న పాకిస్థానీ ఏజెన్సీల ఉచ్చులో పడవద్దని స్పష్టంగా చెబుతున్నాము. పాకిస్థానీ ఏజెన్సీల వల్ల 30ఏళ్లుగా జమ్ముకశ్మీర్​లో అలజడులు నెలకొన్నాయి. కనీ వాటి దుశ్చర్యలను, వ్యూహాలను అర్థం చేసుకుని, ఆ ఉచ్చులో నుంచి బయటపడాల్సిన సమయం వచ్చింది," అని దిల్బాగ్​ సింగ్​ అభిప్రాయపడ్డారు.

ఉగ్రవాదంపై పోరాటంలో ప్రజల పాత్ర కూడా అధికంగా ఉందన్నారు జమ్ముకశ్మీర్​ డీజీపీ.

Jammu terrorism news : "ప్రజల నుంచి మాకు పూర్తి మద్దతు లభిస్తోంది. భారీ సంఖ్యలో యువత మాకు మద్దతిస్తోంది. ఉగ్రవాదం కనిష్ఠ స్థాయికి చేరుకోవడానికి ముఖ్య కారణం ఇదే. ఇప్పుడున్న ఉగ్రవాదులను కూడా అంతం చేసేస్తాము. అందుకోసం ఇప్పటికే రంగంలోకి దిగాము," అని దిల్బాగ్​ సింగ్​ తెలిపారు.

జమ్ముకశ్మీర్​లో శాంతియుత వాతావరణాన్ని దెబ్బ తిసేందుకు ఎలాంటి ప్రణాళికలు రచించినా, వాటిని సమర్థవంతంగా తిప్పికొడతామని ధీమా వ్యక్తం చేశారు డీజీపీ.

ఉగ్రవాది నివాసం కూల్చివేత..

జమ్ముకశ్మీర్​ పుల్వామాలోని జైషే మహమ్మద్​ కమాండర్​ ఆషిఖ్​ నెంగ్రూ నివాసాన్ని అధికారులు శనివారం కూల్చివేశారు. రాజ్​పొరాలోని రెండస్థుల భవనాన్ని బుల్డోజర్​ సాయంతో నేలమట్టం చేశారు.

Ashiq Nengroo house demolished in Jammu Kashmir : 2019 పుల్వామా దాడిలో వాంటెడ్​ టెర్రరిస్ట్గా ఉన్నాడు నెంగ్రూ. జమ్ముకశ్మీర్​లోకి ఉగ్రవాదుల చొరబడటంలో నెంగ్రూది కీలక పాత్ర అని ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో వివిధ ఉగ్రవాద ఘటనల్లో అతని హస్తం ఉందని అధికారులు భావిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టారు పోలీసులు.