తెలుగు న్యూస్  /  National International  /  Man Hacked To Death On Busy Karnataka Street

Man hacked to death: ‘నడి రోడ్డుపై నరికి చంపేశారు..’

HT Telugu Desk HT Telugu

28 February 2023, 18:31 IST

    • Karnataka news: పట్టపగలు, నడి రోడ్డుపై అంతా చూస్తుండగానే ఒక యువకుడిని నలుగురు వ్యక్తులు దారుణంగా నరికి చంపేశారు.
యువకుడిపై దాడి చేస్తున్న దృశ్యం
యువకుడిపై దాడి చేస్తున్న దృశ్యం

యువకుడిపై దాడి చేస్తున్న దృశ్యం

Karnataka news: పట్టపగలు, నడి రోడ్డుపై అంతా చూస్తుండగానే ఒక యువకుడిని నలుగురు వ్యక్తులు దారుణంగా నరికి చంపిన ఘటన మంగళవారం కర్నాటకలో చోటు చేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Lok Sabha election : మొబైల్​ నెంబర్​తో మీ పోలింగ్​ స్టేషన్​ లొకేషన్​ని ఇలా తెలుసుకోండి..

Prachi Nigam : 'చాణక్యుడిని కూడా..'- ట్రోల్స్​పై స్పందించిన యూపీ క్లాస్​ 10 టాపర్​

ICSE exam results 2024 : త్వరలో ఐసీఎస్​ఈ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

Manipur news: మణిపూర్ లో సీఆర్పీఎఫ్ క్యాంప్ పై కుకీ మిలిటెంట్ల దాడి; ఇద్దరు జవాన్లు మృతి

Man hacked to death: రక్తపు మడుగులో..

కర్నాటకలోని బీదర్ జిల్లాలో ఉన్నత్రిపురాంత గ్రామం ప్రధాన రహదారిపై ఉన్న ఒక జంక్షన్ వద్ద ఈ దారుణం చోటు చేసుకుంది. కత్తులు, ఇతర పదునైన ఆయుధాలు పట్టుకున్న నలుగురు వ్యక్తులు ఆనంద్ ఫులే అనే వ్యక్తిని తరుముకుంటూ వచ్చారు. అనంతరం, రోడ్డుపై పడిపోయిన ఆ వ్యక్తిని దారుణంగా, విచక్షణా రహితంగా నరికారు. పట్టపగలు జరిగిన ఈ దారుణాన్ని అక్కడున్న వారు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. ఆనంద్ ఫులే పై విచక్షణారహితంగా దాడి చేసి, అతడిని రక్తపు మడుగులో వదిలేసి,వారి వెళ్లిపోయారు. ఇదంతా అక్కడున్న కెమెరాల్లో రికార్డయింది. అనంతరం తేరుకున్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

Man hacked to death: కేసు నమోదు

ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రమైన గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న ఆనంద్ ఫులే ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆనంద్ ఫులే తో పాటు అతడి స్నేహితుడికి కూడా గాయాలయ్యాయి. పాత కక్షల కారణంగానే ఈ దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దాడి చేసిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారని, వారిని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు.