తెలుగు న్యూస్  /  National International  /  'India Belongs To Me As Much As To Pm Modi': 'Best Country For..': Muslim Body Head

India belongs to Muslims too: ‘‘ఈ దేశంపై మోదీకి ఎంత హక్కుందో.. మాకూ అంతే ఉంది’’

HT Telugu Desk HT Telugu

11 February 2023, 19:00 IST

    • India belongs to Muslims too: భారత దేశం తమది కూడా అని జమాయిత్ ఉలేమా ఇ హింద్ (Jamiat Ulama-i-Hind) అధ్యక్షుడు మౌలానా మొహమూద్ మదానీ (Maulana Mahmood Madani) వ్యాఖ్యానించారు. ఈ దేశం ప్రధాని నరేంద్ర మోదీకి, ఆరెస్సెస్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ కు ఎంత చెందుతుందో, తమకూ అంతే చెందుతుందని ప్రకటించారు.
జమాయిత్ ఉలేమా ఇ హింద్ అధ్యక్షుడు మౌలానా మొహమూద్ మదానీ
జమాయిత్ ఉలేమా ఇ హింద్ అధ్యక్షుడు మౌలానా మొహమూద్ మదానీ (File)

జమాయిత్ ఉలేమా ఇ హింద్ అధ్యక్షుడు మౌలానా మొహమూద్ మదానీ

India belongs to Muslims too: బలవంతపు మత మార్పిడులకు తాము కూడా వ్యతిరేకమేనని మదానీ స్పష్టం చేశారు. అయతే, ఇప్పుడు స్వచ్ఛంధంగా మత మార్పిడి చేసుకున్నా, తప్పుడు కేసులు పెట్టి జైళ్లో పెడుతున్నారని ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

Islam is oldest religion: అత్యంత పురాతన మతం

ఇస్లాం భారత్ లో అత్యంత పురాతన మతమని జమాయిత్ ఉలేమా ఇ హింద్ (Jamiat Ulama-i-Hind) అధ్యక్షుడు మౌలానా మొహమూద్ మదానీ (Maulana Mahmood Madani) వ్యాఖ్యానించారు. ఈ దేశంపై తమకూ సమాన హక్కులున్నాయన్నారు. ‘‘భారత్ మా దేశం. ఈ దేశం నరేంద్ర మోదీ (PM Modi)కి, మోహన్ భాగవత్ కు ఎంత చెందుతుందో మహమూద్ మదానీకి అంతే చెందుతుంది. ఒకరికి ఎక్కువ చెందడం, మరొకరికి తక్కువ చెందడం అనేది లేదు. అందరికీ ఇది సొంత దేశమే’’ అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ లో జరిగిన జమాయిత్ ఉలేమా ఇ హింద్ (Jamiat Ulama-i-Hind) ప్లీనరీ ని ఉద్దేశించి మదానీ ప్రసంగించారు. ‘‘ఇస్లాం ఈ దేశంలో అత్యంత పురాతన మతం. ఇది ముస్లింల తొలి స్వస్థలం. ఇస్లాం వేరే దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిందనడం పూర్తిగా తప్పు. నిరాధారం. ముస్లింలకు భారత్ అత్యంత ఉత్తమమైన దేశం’’ అని వ్యాఖ్యానించారు.

Religious conversions: మత స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు

భారత్ లో మత స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు అని మదానీ గుర్తు చేశారు. అయితే, బలవంతంగా మతమార్పిడి చేయడానికి తాము వ్యతిరేకమన్నారు. ‘బలవంతం చేసో, ప్రలోభపెట్టో, మోసం చేసో మత మార్పిడికి పాల్పడడం తప్పు. మేం దానికి వ్యతిరేకం’ అన్నారు. అయితే, ముస్లింలు లక్షంగా దాడులు జరుగుతున్నాయని, నమాజ్ ను నిషేధించడం, బుల్ డోజర్లను ప్రయోగించడం వంటివి జరుగుతున్నాయని ఆరోపించారు. జమాయిత్ ఉలేమా ఇ హింద్ (Jamiat Ulama-i-Hind) ప్లీనరీ ఢిల్లీలో మూడు రోజుల పాటు జరగనుంది. ఈ సందర్భంగా ఇస్లామోఫోబియాను వ్యతిరేకిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు.

టాపిక్