తెలుగు న్యూస్  /  National International  /  Four Held For 'Raping' Bengal Monitor Lizard In Maha Forest

ఇదేం పాడు పని.. మహారాష్ట్రలో బెంగాల్ మానిటర్ లిజర్డ్ పై అత్యాచారం

HT Telugu Desk HT Telugu

14 April 2022, 13:14 IST

  • మహారాష్ట్రలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగు చూసింది. సహ్యాద్రి టైగర్ రిజర్వ్‌లో నలుగురు వేటగాళ్లు దారుణానికి ఒడిగట్టారు. బెంగాల్ మానిటర్ లిజర్డ్ (Bengal monitor lizard)  పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

మానిటర్ లిజర్డ్‌పై నలుగురు వ్యక్తుల అత్యాచారం
మానిటర్ లిజర్డ్‌పై నలుగురు వ్యక్తుల అత్యాచారం

మానిటర్ లిజర్డ్‌పై నలుగురు వ్యక్తుల అత్యాచారం

జంతువులపై అత్యాచారాలు ఈ మధ్య పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా ఈ తరహాలోనే మహారాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. బెంగాల్ మానిటర్ లిజర్డ్(Bengal monitor lizard) పై సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది రత్నగిరి జిల్లా పరిధిలోని సహ్యాద్రి టైగర్ రిజర్వ్ లో జరిగింది. ఈ కేసులో నలుగురు నిందితులను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

సీసీ పుటేజీతో…

నిందితులు సహిదరి టైగర్ రిజర్వ్‌ లోకి అటవీ అధికారుల కళ్లుగప్పి ప్రవేశించారు. అక్కడ వారికి కనిపించిన  బెంగాల్ మానిటర్ లిజర్డ్(Bengal monitor lizard) పై అత్యాచారానికి పాల్పడ్డారు. సీసీటీవీ ఫుటేజ్‌లో నలుగురు వ్యక్తులు అక్రమంగా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు తెలుసుకున్న అధికారులు... వీరిని అదుపులోకి తీసుకున్నారు .వీరిని సందీప్ తుక్రామ్, పవార్ మంగేష్, అక్షయ్ కమ్టేకర్, రమేశ్ గాగ్ గా గుర్తించారు

ఇలా బయటపడింది...

అదుపులోకి తీసుకున్న నిందితులను విచారించే క్రమంలో వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో వీరి చేసిన దారుణం బయటపడింది. బెంగాల్ మానిటర్ లిజర్డ్ పై అత్యాచారం చేయటాన్ని రికార్డు చేసినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.

నిందితులను అదుపులోకి తీసుకుని స్థానిక కోర్టులో హాజరుపరచగా.. వీరికి బెయిల్ మంజూరైంది.అయితే కేసు విచారణలో భాగంగా ప్రతి సోమవారం స్థానిక ఫారెస్ట్ అధికారి కార్యాలయానికి వెళ్లాల్సి ఉంది. వీరిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం -1972 ప్రకారం కేసు నమోదు చేసినట్లు సహ్యాద్రి టైగర్ రిజర్వ్ ఫిల్డ్ డైరెక్టర్ నానాసాహెబ్ చెప్పారు.

ఈ బెంగాల్ మానిటర్ లిజర్డ్స్  ఆసియా ఖండంలోని పలు ప్రాంతాల్లో జీవిస్తోంది. ఇవి 61 నుంచి 175 సెం.మీ పొడవు ఉంటాయి. శరీరం చివర్లో తోక ఉంటుంది. వీటి జీవనం ఎక్కువగా వృక్షాలతో ముడిపడి ఉంటుంది. ఇవీ కీటకాలు, చిన్న చిన్న పక్షులు, గుడ్లు, చేపల పిల్లలను ఆహారంగా తీసుకుంటాయి. కొందరూ వీటిని వేటాడుతూ ఆహారంగా తీసుకుంటారు.

టాపిక్