తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lok Sabha Elections 2024 : ‘లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​కి 40 సీట్లు కూడా రావు’- మమత!

Lok Sabha elections 2024 : ‘లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​కి 40 సీట్లు కూడా రావు’- మమత!

Sharath Chitturi HT Telugu

03 February 2024, 8:10 IST

  • Mamata Banerjee on Congress : లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్​పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు మమతా బెనర్జీ. ఎన్నికల్లో.. కాంగ్రెస్​కు కనీసం 40 సీట్లైనా వస్తాయా? అని అనుమానం వ్యక్తం చేశారు.

‘లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​కి 40 సీట్లు కూడా రావు’- మమత!
‘లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​కి 40 సీట్లు కూడా రావు’- మమత! (ANI file)

‘లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​కి 40 సీట్లు కూడా రావు’- మమత!

Mamata Banerjee latest news : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన విపక్ష ఇండియా కూటమిలో విభేదాలు రోజురోజుకు పెరుగుతోంది! బీజేపీలో చేరి.. ఇప్పటికే ఇండియా కూటమికి షాక్​ ఇచ్చారు బిహార్​ సీఎం నితీశ్​ కుమార్​. ఇక ఇప్పుడు.. కాంగ్రెస్​పై బంగాల్​ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన విమర్శలు.. కూటమిలో విభేదాలను మరోమారు బయటపెట్టాయి. 2024 లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​కు 40 సీట్లు రావడం కూడా అనుమానమే అని ఆమె వ్యాఖ్యానించారు. బంగాల్​లో సీట్​ షేరింగ్​ అంశంపై ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరించుకుంటామని కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలోనే మమత ఈ విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

Bengaluru: బెంగళూరులో రాత్రంతా భారీ వర్షం; విమానాశ్రయంలో లీకేజీ; పలు ఫ్లైట్స్ రద్దు

Kejriwal gets interim bail: కేజ్రీవాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు; ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారానికి వీలు

Man chops off girl's head: పెళ్లి క్యాన్సిల్ అయిందని మైనర్ తల నరికి, తీసుకువెళ్లిన యువకుడు

స్టూడెంట్​తో సెక్స్​ చేసిన టీచర్​ అరెస్ట్​.. బెయిల్​పై బయటకు వచ్చి మరో విద్యార్థి వల్ల గర్భం!

కాంగ్రెస్​పై మమతా బెనర్జీ విమర్శలు..

ఇటీవలే బెంగాల్​లోని ఆరు జిల్లాలో రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్​ జోడో న్యాయ్​ యాత్ర. దీనిపై మమతా బెనర్జీ విమర్శల వర్షం కురిపించారు. అది కేవలం ఫొటో షూట్​ అని, రాష్ట్రంలోని మైనారిటీ ఓట్లను చీల్చేందుకు వలస పక్షి వచ్చిందని మండిపడ్డారు.

Mamata Banerjee India : "బీజేపీ నుంచి బలమైన పోటీ ఎదురయ్యే 300 సీట్లల్లో పోటీ చేయాలని నేను కాంగ్రెస్​కి సూచించాను. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. ఇప్పుడు.. రాష్ట్రానికి వచ్చి ముస్లిం ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తున్నారు. అసలు.. 300 సీట్లల్లో పోటీ చేసినా, కాంగ్రెస్​కు కనీసం 40 సీట్లైనా వస్తాయా? అన్నది నాకు అనుమానంగా ఉంది," అని మమతా బెనర్జీ అన్నారు.

"2024 లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ్​ బెంగాల్​లో కూటమిగా ఏర్పడేందుకు నేను సిద్ధమని కాంగ్రెస్​కి చెప్పాను. కానీ వాళ్లు వినలేదు. రెండు సీట్లు ఇస్తామని అన్నాను. ఒప్పుకోలేదు. వాళ్లని 42 సీట్లల్లో పోటీ చేసుకోనివ్వండి. ప్రస్తుతానికైతే రెండు పార్టీల మధ్య సీట్ల సద్దుబాటు విషయంలో మాటలు జరగడం లేదు. బంగాల్​లో బీజేపీని ఓడించేందుకు మేము ఒంటరిగా పోటీ చేస్తాము," అని టీఎంసీ అధినేత్రి స్పష్టం చేశారు.

2024 Lok Sabha elections : రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్​ జోడో న్యాయ్​ యాత్ర.. పశ్చిమ్​ బంగాల్​లోని ఉత్తర దినాజ్​పూర్​, మాల్ది, మర్షిదాబాద్​ వంటి మైనారిటీ ప్రాంతాల్లో జరిగింది. ఈ ప్రాంతాలపై కాంగ్రెస్​కు అనాదిగా పట్టు ఉంది. కానీ ఇప్పుడు.. ఆయా ప్రాంతాల్లో రాహుల్​ గాంధీ పర్యటనలపై మమతా బెనర్జీ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే.. లోక్​సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్టు సమాచారం.

"ఇండియా కూటమిలో మేము కూడా ఉన్నాము. కానీ రాష్ట్రంలో యాత్ర చేస్తున్నట్టు కాంగ్రెస్​ మాకు చెప్పలేదు. అధికారులు చెబితేనే తెలిసింది. డారెక్​ ఒబ్రెయిన్​ (టీఎంసీ ఎంపీ)కి ఫోన్​ చేసి, ర్యాలీకి అనుమతివ్వాలని కోకారు. మరి పశ్చిమ్​ బెంగాల్​కు రావడం ఎందుకు?" అని తన అసంతృప్తిని బయటపెట్టారు మమతా బెనర్జీ.

పశ్చిమ్​ బెంగాల్​లో 'ఇండియా'కు కష్టమేనా..?

West Bengal politics : మోదీని ఢీకొట్టడానికే ఇండియా కూటమి ఏర్పడింది. కానీ అది అంత సులభమైన విషయం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా.. పశ్చిమ్​ బెంగాల్​లో కూటమికి.. పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉంటాయని అంటున్నారు.

పశ్చిమ్​ బెంగాల్​లో టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్​, సీపీఐఎం పార్టీలు కీలకంగా ఉన్నాయి. బీజేపీని పక్కన పెడితే.. టీఎంసీ- సీపీఐఎం మధ్య శత్రుత్వం ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతోంది. వాస్తవానికి.. సీపీఐఎం ప్రభుత్వాన్ని గద్దె దించే.. సీఎం అయ్యారు మమతా బెనర్జీ. ఇక సీపీఐఎం- కాంగ్రెస్​కి కూడా పడదు. మరి సిద్ధాంతాల పరంగా చాలా వ్యత్యాసం ఉన్న ఈ పార్టీలు.. ఎలా ఒక్కటి అవుతారు? అన్నది వేచిచూడాలి.