ఒంటరిగా పోటీ.. మమతా బెనర్జీ ప్రకటన.. సీట్ల పంపకాల ప్రతిపాదన తిరస్కరణ-mamata banerjee vows to fight alone in lok sabha polls from bengal ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఒంటరిగా పోటీ.. మమతా బెనర్జీ ప్రకటన.. సీట్ల పంపకాల ప్రతిపాదన తిరస్కరణ

ఒంటరిగా పోటీ.. మమతా బెనర్జీ ప్రకటన.. సీట్ల పంపకాల ప్రతిపాదన తిరస్కరణ

HT Telugu Desk HT Telugu
Jan 24, 2024 12:40 PM IST

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో సీట్లను పంచుకోవాలన్న తన ప్రతిపాదనలను మిత్రపక్షమైన కాంగ్రెస్‌తో జరిగిన సమావేశంలో తిరస్కరించినట్లు మమతా బెనర్జీ తెలిపారు.

ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన మమతా బెనర్జీ
ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన మమతా బెనర్జీ (HT_PRINT)

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని, కాంగ్రెస్‌తో సీట్ల పంపకం చర్చలు విఫలమయ్యాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి బుధవారం ప్రకటించారు. సీట్ల పంపకాలపై తన ప్రతిపాదనలను సమావేశంలో తిరస్కరించినట్లు టీఎంసీ అధినేత్రి తెలిపారు.

తృణమూల్ కాంగ్రెస్ కంచుకోట అయిన బీర్భూమ్ జిల్లాలో పశ్చిమ బెంగాల్ సీఎం, పార్టీ నేతల మధ్య క్లోజ్ డోర్ మీటింగ్ జరిగిన మరుసటి రోజే మమతా బెనర్జీ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధం కావాలని, సీట్ల పంపకాల గురించి ఆలోచించవద్దని నేతలందరినీ కోరినట్లు తెలిసింది.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్, టీఎంసీ మధ్య విభేదాలు తలెత్తాయి. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి రాష్ట్రంలోని మొత్తం 42 నియోజకవర్గాల్లో రెండింటిని మాత్రమే పంచుకోవాలన్న టీఎంసీ ప్రతిపాదనపై రాష్ట్ర కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది.

టీఎంసీ తీవ్ర విమర్శకుడు, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి సీఎం మమతా బెనర్జీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అవకాశవాది అని, ఆమె దయాదాక్షిణ్యాలతో ఎన్నికలను ఎదుర్కోబోమని కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యానించారు.

‘ఈసారి మమతా బెనర్జీ దయాదాక్షిణ్యాలతో ఎన్నికలు జరగవు. మమతా బెనర్జీ ఇస్తానంటున్న రెండు స్థానాల్లో బీజేపీ, టీఎంసీలను కాంగ్రెస్ ఓడించింది. ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. మమతా బెనర్జీ అవకాశవాది. ఆమె 2011 లో కాంగ్రెస్ దయతో అధికారంలోకి వచ్చింది’ అని పార్టీ నాయకుడు చౌదరి అన్నారు.

IPL_Entry_Point