తెలుగు న్యూస్  /  National International  /  Chennai: 5 Persons Drown While Performing Rituals; Cm Announces Compensation

Chennai tragedy: చెన్నైలో విషాదం; నీటిలో మునిగి ఐదుగురు విద్యార్థుల దుర్మరణం

HT Telugu Desk HT Telugu

05 April 2023, 20:45 IST

  • Chennai tragedy: చెన్నై న గరంలో విషాదం చోటు చేసుకుంది. గుడి చెరువులో మునిగి ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.  

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Chennai tragedy: చెన్నై న గరంలో విషాదం చోటు చేసుకుంది. గుడి చెరువులో మునిగి ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని నాంగనల్లూరులో ఉన్న ధర్మలింగేశ్వర ఆలయ కోనేరులో పడి విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

Chennai tragedy: నీటిలో మునిగి..

నాంగనల్లూరులో ఉన్న ధర్మలింగేశ్వర ఆలయంలో తీర్థవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. స్థానిక అధికారులకు కానీ, పోలీసులకు కానీ సమాచారం ఇవ్వకుండానే ఆలయ నిర్వాహకులు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన విద్యార్థులు ఆలయ సంప్రదాయంలో భాగంగా ఆలయ సమీపంలోని చెరువులో స్నానం చేయడానికి వెళ్లారు. ఐదుగురు విద్యార్థుల్లో ఒకరు ఆ నీటిలో మునిగిపోతుండగా, కాపాడడానికి ప్రయత్నించిన మిగతా నలుగురు విద్యార్థులు కూడా నీళ్లలో మునిగిపోయి చనిపోయారు.

Chennai tragedy: సీఎం సంతాపం

ఈ దుర్ఘటన పట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని స్థానిక మంత్రి ని ఆదేశించారు. పోలీసులకు, అధికారులకు సమాచారం ఇవ్వకుండా, అజాగ్రత్తగా ఈ కార్యక్రమం చేపట్టిన ఆలయ నిర్వాహకులపై చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి ప్రకటించారు.