తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  800 Covid Positives On Aus Ship: సిడ్నీ తీరంలో నౌక; అందులో 800 మందికి కరోనా

800 Covid positives on Aus ship: సిడ్నీ తీరంలో నౌక; అందులో 800 మందికి కరోనా

HT Telugu Desk HT Telugu

12 November 2022, 20:27 IST

  • 800 Covid positives on Aus ship: సిడ్నీ తీరంలో ఉన్న నౌకలోని 800 మందికి కోవిడ్ సోకినట్లు తేలడంతో ఆస్ట్రేలియాలో మళ్లీ కరోనా భయాలు ప్రారంభమయ్యాయి. 

కార్నివాల్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్
కార్నివాల్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్

కార్నివాల్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్

800 Covid positives on Aus ship: ఆస్ట్రేలియా లో భారీ క్రూయిజ్ నౌకల్లో ఒకటైన కార్నివాల్ ప్రిన్సెస్ షిప్ లోని 800 మంది ప్రయాణీకులకు కరోనా సోకింది. దాంతో ఆ నౌకను సిడ్నీ తీరంలోనే నిలిపేశారు. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్ట్రేలియా హోం మంత్రి తెలిపారు. కాగా, న్యూ సౌత్ వేల్స్ అధికారులు ఈ కరోనా తీవ్రతను టయర్ 3 కేటగిరీగా, తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన ముప్పుగా ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

Covid vaccine: సేఫ్టీ ఇష్యూస్ కారణంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఉపసంహరించుకోనున్న ఆస్ట్రాజెనెకా

Haryana: హరియాణాలో సంక్షోభంలో బీజేపీ సర్కారు; అసెంబ్లీలో మారిన సంఖ్యాబలం

US crime news: ‘‘డాడీకి గుడ్ బై చెప్పు’’ - మూడేళ్ల కొడుకును షూట్ చేసి చంపేసిన కర్కశ తల్లి

Dhruv Rathee: ధృవ్​ రాఠీ: సోషల్ మీడియా సంచలనం.. మోదీనే ఎందుకు టార్గెట్ చేశారు?

800 Covid positives on Aus ship: గతంలోనూ..

2020లోనూ ఆస్ట్రేలియాలో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు రూబీ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ లో ఉన్న ప్రయాణీకులు కరోనా బారిన పడ్డారు. ఆ షిప్ లోని వారిలో 914 మందికి కరోనా సోకగా, వారిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇప్పుడు ముప్పు అంత ప్రాణాంతకంగా లేనందున, ఒక్కొక్కరికి వేర్వేరుగా వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం ఆ షిప్ నుంచి దింపి, ఐసోలేషన్ కు పంపిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం షిప్ లో ఉన్న కరోనా సోకిన వారిని ఐసోలేట్ చేశామని, వారు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆ క్రూయిజ్ నిర్వహణ సంస్థ కార్నివాల్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఒమిక్రాన్ XBB వేరియంట్ వల్లనే షిప్ లో ఆ స్థాయిలో కరోనా కేసులు నమోదైనట్లు భావిస్తున్నారు.

టాపిక్