తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay Deverakonda Fans Requests Him To Not To Do Jana Gana Mana With Puri Jagannadh

Netizens troll on Liger: లైగర్‌పై ఫుల్ ట్రోల్.. పూరితో ఇంకో సినిమా చేయవద్దని విజయ్‌కు సూచన

27 August 2022, 13:44 IST

    • లైగర్ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. ఇందులో హీరోగా చేసిన విజయ్ దేవరరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్‌పై ట్రోల్స్ చేస్తున్నారు. కొంతమందైతే పూరితో మరో సినిమా చేయవద్దని సూచిస్తున్నారు.
విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ (HT)

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం లైగర్. పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ఇండియా స్థాయిలో గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి రోజు నుంచి నెగిటివ్ టాక్ రావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో సామాజిక మాధ్యమాల వేదికగా సినిమాపై విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. దీంతో పూరి దర్శకత్వంలో విజయ్ తర్వాత చేయనున్న జనగణమణ(జేజీఎం) చేయవద్దని ఫ్యాన్స్ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Andre Russel Hindi Song: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో వెస్టిండీస్ క్రికెటర్.. హిందీ పాట పాడిన రసెల్

Hollywood Thrillers on OTT: ఓటీటీల్లోని ఈ హాలీవుడ్ థ్రిల్లర్స్ చూశారా? అసలు థ్రిల్ అంటే ఏంటో తెలుస్తుంది

Panchayat 3 OTT Release Date: సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Pushpa 2 first single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

లైగర్‌కు విడుదలైన తొలి ఆట నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో క్రాస్ బ్రీడ్ కాస్త భారీ డిజాస్టర్‌గా మారింది. విజయ్ కెరీర్‌లోనే కాకుండా పూరికే అత్యంత దారుణమైన నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో విజయ్‌తో పాటు పూరి జగన్నాథ్‌పై కూడా నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ రూపంలో విభిన్నంగా స్పందిస్తున్నారు.

కొంతమంది విజయ్ డైహార్డ్ ఫ్యాన్స్.. పూరి జగన్నాథ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడితో జనగణమణ అనే సినిమా చేయవద్దని సూచిస్తున్నారు. పూరి దర్శకత్వంలో ఇంక పనిచేయవద్దని ఉచిత సలహాలు ఇస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై కొంత భాగం చిత్రీకరణ కూడా పూర్తయింది. భారీ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ చేయనున్న జేజీఎం సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. ఈ పాన్ఇండియా ప్రాజెక్టుకు సంబంధించిన నటీ, నటులు, సాంకేతిక నిపుణులు కూడా రెడీ అయ్యారు. ఈ సినిమాను కూడా పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో చార్మీ కౌర్, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వీరితో పాటు ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లితన శ్రీకర స్టూడియోస్ ద్వారా ఈ చిత్ర నిర్మాణంలో భాగమయ్యారు. ఈ సినిమాను 2023 ఆగస్టు 3న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.