తెలుగు న్యూస్  /  Entertainment  /  Tollywood Actor Prudhvi Raj Pay Alimony <Span Class='webrupee'>₹</span>8 Lakh Per Month To Ex Wife

Prudhvi Alimony Settlement: 30 ఇయర్స్ పృథ్వీకి కోర్టు షాక్.. భార్యకు నెలకు రూ.8 లక్షల భరణం చెల్లించాల్సిందిగా ఆదేశం

01 October 2022, 15:06 IST

    • Prudhvi 8 lakh Alimony to his Wife: టాలీవుడ్ యాక్టర్ 30 ఇయర్స్ పృథ్వీకి కోర్టు షాకిచ్చింది. భరణం చెల్లించాల్సిందిగా అతడి భార్య గతంలో కోర్టును ఆశ్రయించారు. తాజాగా తుదితీర్పు వెలువరించిన ఫ్యామిలీ కోర్టు నెలకు రూ.8 లక్షలు చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
30 ఇయర్స్ పృథ్వీరాజ్
30 ఇయర్స్ పృథ్వీరాజ్

30 ఇయర్స్ పృథ్వీరాజ్

30 Years Prudhvi Alimony settlement to his Wife: టాలీవుడ్ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పృథ్వీరాజ్‌ మధ్యలో రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ.. వివాదంలో చిక్కుకోవడంతో ప్రస్తుతం సినిమాలపై తిరిగి తన ఫోకస్ పెట్టారు. 30 ఇయర్స్ పృథ్వీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడుకు జిల్లా ఫ్యామిలీ కోర్టు షాకిచ్చింది. పృథ్వీ తన భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెలా రూ.8 లక్షల భరణం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రతి నెలా 10వ తేదీ లోపు సదరు మొత్తం చెల్లించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

Andre Russel Hindi Song: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో వెస్టిండీస్ క్రికెటర్.. హిందీ పాట పాడిన రసెల్

Hollywood Thrillers on OTT: ఓటీటీల్లోని ఈ హాలీవుడ్ థ్రిల్లర్స్ చూశారా? అసలు థ్రిల్ అంటే ఏంటో తెలుస్తుంది

Panchayat 3 OTT Release Date: సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Pushpa 2 first single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

విజయవాడకు చెందిన శ్రీలక్ష్మీకి.. తూర్పుగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనాకి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్ అలియాస్ 30 ఇయర్స్ పృథ్వీతో 1984లో వివాహం జరిగింది. వీరికి ఓ కుమార్తే, కుమారుడు ఉన్నారు. అయితే తనను తరచూ పృథ్వీరాజ్ వేధించేవాడని శ్రీలక్ష్మీ కోర్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. పృథ్వీరాజ్ విజయవాడలో తన పుట్టింట్లో ఉంటూనే చెన్నైలో సినిమా అవకాశాలకు ప్రయత్నించేవాడని, ఆ ఖర్చులన్నీ తమ తల్లిదండ్రులే భరించేవారని స్పష్టం చేశారు. 2016 ఏప్రిల్ 5న తనను ఇంటి నుంచి గెంటేశారని, దీంతో తాను పుట్టింటికి వచ్చి అక్కడే ఉంటున్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన భర్త సినిమాలు, సీరియల్స్ ద్వారా నెలకు రూ.30 లక్షలు సంపాదిస్తున్నాడని, అతడి నుంచి భరణం ఇప్పించాల్సిందిగా 2017 జనవరి 10 న్యాయస్థానాన్ని ఆశ్రయించారు శ్రీలక్ష్మీ. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి.. నటుడు పృథ్వీ తన భార్యకు నెలకు రూ.8 లక్షలు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ప్రతి నెలా 10 తేదీలోగా మెయింటనెన్స్ చెల్లించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ భరణం కేసు వేసినప్పటి నుంచి వర్తిస్తుందని స్పష్టం చేశారు.

తెలుగు చిత్రసీమలో 30 ఇయర్స్ పృథ్వీగా బాగా పాపులర్ అయ్యారు. గత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేసిన ఆయన. టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛైర్మన్ పదవీ దక్కింది. అయితే ఓ వివాదంలో చిక్కుకున్న ఆయన ఆ పదవీని కోల్పోయారు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న పృథ్వీ.. ఇటీవలే మెగా బ్రదర్ నాగ బాబును కలిసి జనసేన పార్టీలో చేరారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.