తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Animal Pan India Release: పాన్ఇండియా రేంజ్‌లో యానిమల్.. యాక్షన్ డ్రామాగా సినిమా

Animal Pan India Release: పాన్ఇండియా రేంజ్‌లో యానిమల్.. యాక్షన్ డ్రామాగా సినిమా

17 January 2023, 6:25 IST

    • Animal Pan India Release: సందీప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న యానిమల్ చిత్రాన్ని పాన్ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ సినిమాను హిందీతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
రణ్‌బీర్ కపూర్
రణ్‌బీర్ కపూర్

రణ్‌బీర్ కపూర్

Animal Pan India Release: అర్జున్ రెడ్డి సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అనంతరం ఈ సినిమాను షాహిద్ కపూర్‌తో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి మరోసారి అదిరిపోయే విజయాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో యానిమల్ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి సరికొత్త అప్డేట్ వచ్చింది. యానిమల్ చిత్రాన్ని పాన్ఇండియా రేంజ్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Netflix OTT top movies: నెట్‍ఫ్లిక్స్‌లో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ మూవీ

Murder in Mahim OTT Release Date: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మర్డర్ ఇన్ మహిమ్ స్ట్రీమింగ్ డేట్ ఇదే

Nikhil Swayambhu: ఒక్క ఫైట్ కోసం రూ.8 కోట్లు.. నిఖిల్ స్వయంభు మూవీ షూటింగ్ మరో లెవల్లో..

Vijay Deverakonda Birthday: విజయ్ దేవరకొండ పుట్టిన రోజున మూడు సినిమాల నుంచి అప్‍డేట్స్: వివరాలివే

రణ్‌బీర్ కపూర్ యానిమల్ సినిమాను పాన్ఇండియా రేంజ్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. హిందీతో పాటు పలు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం సందీప్ రెడ్డి ఈ సినిమాను తండ్రి-కొడుకుల సంబంధం గురించి తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.

ఇందులో రణ్‌బీర్ కపూర్ కొడుకు పాత్రలో నటిస్తుండగా.. అతడికి తండ్రిగా అనిల్ కపూర్ నటిస్తున్నారు. ఇంతకమునుపెన్నడు చూపించని విధంగా తండ్రి-కుమారుల రిలేషన్‌షిప్‌ను సందీప్ చూపించనున్నాడట. తండ్రిని ఎవరైనా ఏమైనా అన్నా ఎంత దూరమైన వెళ్లే దూకుడైన కుమారుడి పాత్రలో రణ్‌బీర్ నటిస్తున్నారట. రొమాన్స్, డ్రామా, యాక్షన్ జోనర్లలో ఈ చిత్రం తెరకెక్కుతుందని సమాచారం.

ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ సరసన రష్మికా మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే సౌత్‌లో ఫుల్ పాపులారిటీ పెంచుకున్న రష్మిక.. ఈ సినిమాకు మరో అదనపు బలంగా మారనుంది. టీ సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళీ పిక్చర్స, సినీ 1 స్టూడియోస్ పతాకంపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా తదితరులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.