తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Payal Ghosh On Metoo: ఆ డైరెక్టర్ నన్ను మూడో మీటింగ్‌లోనే రేప్ చేశాడు.. ఎన్టీఆర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Payal Ghosh on MeToo: ఆ డైరెక్టర్ నన్ను మూడో మీటింగ్‌లోనే రేప్ చేశాడు.. ఎన్టీఆర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

18 March 2023, 16:11 IST

    • Payal Ghosh on MeToo: ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి చిత్రంలో మరో హీరోయిన్‌గా చేసిన పాయల్ ఘోష్ బాలీవుడ్ అగ్ర దర్శకుడిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. అతడు తనను రేప్ చేశాడని స్పష్టం చేసింది.
పాయల్ ఘోష్
పాయల్ ఘోష్

పాయల్ ఘోష్

Payal Ghosh on MeToo: గ్లోబల్ స్టార్ ఎన్‌టీఆర్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఊసరవెళ్లి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా కాకుండా.. ఆమె స్నేహితురాలి పాత్రలో పాయల్ ఘోష్ నటించింది. తెలుగులో ప్రయాణం, ఊసరవెల్లి లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి వీలు చిక్కినప్పుడల్లా ప్రశంసల వర్షం కురిపిస్తుంది. అంతేకాకుండా ఎన్‌టీఆర్‌కు మద్దతుగా మాట్లాడుతూ అతడితో వర్క్ ఎక్స్‌పీరియన్స్ మర్చిపోలేనని పలు సందర్భాల్లో తెలిపింది. అయితే సౌత్ సినిమాలపై సానుకూలంగా మాట్లాడటంతో కొంతమంది ఆమెను ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. తాజాగా వీటిపై స్పందించిన ఈ ముద్దుగుమ్మ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ బాలీవుడ్ డైరెక్టర్ కలిసిన మూడో మీటింగ్‌లోనే తనను రేప్ చేశాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Netflix OTT top movies: నెట్‍ఫ్లిక్స్‌లో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ మూవీ

Murder in Mahim OTT Release Date: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మర్డర్ ఇన్ మహిమ్ స్ట్రీమింగ్ డేట్ ఇదే

Nikhil Swayambhu: ఒక్క ఫైట్ కోసం రూ.8 కోట్లు.. నిఖిల్ స్వయంభు మూవీ షూటింగ్ మరో లెవల్లో..

Vijay Deverakonda Birthday: విజయ్ దేవరకొండ పుట్టిన రోజున మూడు సినిమాల నుంచి అప్‍డేట్స్: వివరాలివే

నేను సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరు నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్లలో, అగ్ర దర్శకులతో పనిచేశాను. కానీ ఎవరూ నాపై అనుచితంగా ప్రవర్తించలేదు. కానీ బాలీవుడ్‌లో డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌తో పనిచేయకుండానే అతడు మూడో మీటింగ్‌లోనే నన్ను రేప్ చేశాడు. అలాంటప్పుడు నేను సౌత్ ఇండస్ట్రీ గురించి ఎందుకు గొప్పగా చెప్పకూడదు. అంటూ పాయల్ ఘోష్ ప్రశ్నించింది.

అంతటితో ఆగకుండా జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో పనిచేశానని, ఆయన కూడా ఎప్పుడూ తనపై మిస్ బిహేవ్ చేయలేదని చెప్పుకొచ్చింది. "నేను సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌తో కూడా పనిచేశాను. ఆయన కూడా నాపై ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదు. అంత గొప్పమనిషి అతడు. అందుకే నాకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం." అని పాయల్ ఘోష్ తెలిపింది.

పాయల్ ఘోష్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ప్రయాణం సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసింది. ఈ సినిమా తర్వాత తారక్‌తో కలిసి ఊసరవెల్లి చిత్రంలో కనిపించింది. ఇది కాకుండా మిస్టర్ రాస్కెల్ అనే మరో సినిమా చేసింది. ప్రస్తుతం హిందీలో ఆమె కోయి జానే నా అనే సినిమాలో నటించింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.