తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns April 11th Episode: మిస్సమ్మ చేతికి అసలు నగలు.. భాగీని ఇరికించనున్న మనోహరి.. మంగళను చంపేస్తానని వార్నింగ్

NNS April 11th Episode: మిస్సమ్మ చేతికి అసలు నగలు.. భాగీని ఇరికించనున్న మనోహరి.. మంగళను చంపేస్తానని వార్నింగ్

Sanjiv Kumar HT Telugu

11 April 2024, 12:46 IST

  • Nindu Noorella Saavasam April 11th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 11వ తేది ఎపిసోడ్‌‌లో అరుంధతి ఒరిజినల్ నగలు మిస్సమ్మ చేతికి చిక్కుతాయి. అది తెలుసుకున్న మనోహరి అవే నగలతో ఇరికించేందుకు ప్లాన్ చేస్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 11వ తేది ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 11వ తేది ఎపిసోడ్‌‌

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 11వ తేది ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 11th April Episode) మనోహరిని తన పెద్దకూతురుగా భావించి పెళ్లి కూతురిని చేసేందుకు అనుమతించమని అడుగుతాడు రామ్మూర్తి. అమర్​ కుటుంబం ఒప్పుకోవడంతో రామ్మూర్తి ఇంటికి వెళ్తుంది మనోహరి. అసలు నీ పెళ్లి రేపు అవుతుందా? అని రామ్మూర్తి అడగ్గానే మనోహరి షాక్‌ అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Janhvi Kapoor Partner: తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన జాన్వీ కపూర్.. ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనట

Panchayat 3 Trailer: పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది.. మరింత రాజకీయం, నవ్వులతో అదిరిపోయింది

Getup Srinu: ఆ ఇద్దరు హీరోలపై నమ్మకం కుదర్లేదు.. గెటప్ శ్రీను పర్ఫెక్ట్.. డైరెక్టర్ కామెంట్స్

Suchitra Dhanush: హీరో ధనుష్ గే.. రాత్రి 3 గంటలకు నా భర్తతో ఏం పని.. సింగర్ సుచిత్ర కామెంట్స్

చంపేస్తానని బెదిరింపు

ఎందుకు అలా అడుగుతున్నారని మనోహరి అంటుంది. ఏం లేదు రేపు పెళ్లి పెట్టుకుని ఎందుకు ఇంత డల్‌గా ఉన్నావు అని అడుగుతాడు రామ్మూర్తి. దీంతో ఏం లేదు అని చెబుతుంది మనోహరి. ఇంతలో మంగళ గిల్టీ నగలు వేసుకున్న విషయం మనోహరికి రామ్మూర్తి చెప్తాడు. దీంతో మంగళ వైపు కోపంగా చూస్తుంది మనోహరి. దాంతో మంగళ భయపడుతుంది. ఇంతలో మూర్తికి ఫోన్‌ రావడంతో బయటకు వెళ్తాడు. వెంటనే మనోహరి కోపంగా మంగళ గొంతు పట్టుకుని చంపేస్తానని బెదిరిస్తూ నగలు ఎక్కడున్నాయని అడుగుతుంది.

దీంతో మంగళ నగలు తీసుకొచ్చి ఇస్తుంది. అవి కూడా గిల్టీ నగలు కావడంతో మనోహరి షాక్ అవుతుంది. ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు. నా ప్లాన్‌ మొత్తం తెలుసుకున్నారని ఆలోచిస్తుంది. మరోవైపు మిస్సమ్మ కూడా నగల గురించి ఆలోచిస్తుంది. మనోహరి గిల్టీ నగలు ఇంటికి తీసుకొస్తే.. వాటిని డూప్లికేట్‌ అని ఎలా ప్రూవ్‌ చేయాలని ఆలోచిస్తూ ఒరిజినల్‌ నగలు ఉండి ఉంటే ‌ఫ్రూవ్‌ చేయొచ్చని అనుకుంటుండగానే దూరంలో ఒక బ్యాగ్‌ కనిపిస్తుంది.

ఎవరు తీసుకొచ్చి పెట్టారు

బ్యాగ్‌ దగ్గరకు వెళ్లి తెరచి చూస్తే అందులో ఒరిజినల్ నగలు ఉంటాయి. వెంటనే రాథోడ్‌ను పిలుస్తుంది భాగమతి. ఏమైంది మిస్సమ్మ ఎందుకలా అరిచావు.. ఇవి అమ్మగారి నగలులా ఉన్నాయి అంటాడు రాథోడ్​. లా కాదు రాథోడ్‌ అమ్మగారి నగలే.. అవి కూడా డూప్లికేట్‌ కాదు ఒరిజినల్‌.. అని మిస్సమ్మ అంటుంది. అవును మిస్సమ్మ, ఎవరు తీసుకెళ్లారో, ఎక్కడున్నయో తెలియని నగలు ఇక్కడికి ఎలా వచ్చాయి. ఎవరు తీసుకొచ్చి పెట్టి ఉంటారు అంటాడు రాథోడ్​.

మొన్న ఇలానే పోయిందనుకున్న తాళి సడెన్‌‌గా ప్రత్యక్షమయింది. ఇప్పుడు నగలు కూడా ఇంత మంది ఉన్నా నాకే కనిపించేలా నా రూంలో ప్రత్యక్షమయ్యాయి. ఆ దేవుడు మనవైపు ఉన్నాడు రాథోడ్‌. మనకు సాయం చేయాలని చూస్తున్నాడు అంటుంది మిస్సమ్మ. అవును మిస్సమ్మ అందుకే ఈ నగలు మనకు దొరికేలా చేశాడు అంటాడు రాథోడ్​. ఈ ఒక్క బ్యాగుతో మనోహరి చేసే మోసాల్ని, చేయబోయే దారుణాల్ని బయటపెట్టవచ్చు అని మిస్సమ్మ, రాథోడ్​ మాట్లాడుకుంటుంటే ఒక కిటికీలోంచి అరుంధతి, మరో కిటికీలోంచి నీల చూస్తుంటారు.

హ్యాపీగా అరుంధతి

నీల వెంటనే మనోహరికి చెప్పాలని వెళ్తుంది. నీల మనోహరికి ఫోన్‌ చేసి నగలు ఇక్కడే ఉన్నాయని మిస్సమ్మ దగ్గరే ఉన్నాయని చెప్తుంది. దీంతో మనోహరి షాక్‌ అవుతుంది. ఆ నగలు మిస్సమ్మ దగ్గరకు ఎలా వెళ్లాయని అడగ్గానే మిస్సమ్మ రూంలో జరిగిన విషయం మొత్తం చెప్తుంది. దీంతో అదే నగలతో దాన్ని దెబ్బ కొడతానని మనోహరి నీలకు చెప్తుంది. మరోవైపు అరుంధతి హ్యాపీగా బయటకు వస్తుండగా ఎవరికో పెళ్లి జరిగినట్లు అనిపించడంతో గుప్తను వెళ్లి అడుగుతుంది.

పెళ్లి ఎవ్వరూ ఆపలేరు

రేపు జరగబోయే పెళ్లి గురించి కాదు ఇప్పుడు ముంచుకొస్తున్న మనోహరి ప్రమాదం గురించి ఆలోచించు మిస్సమ్మను బయటకు వెళ్లగొట్టేందుకే వస్తుంది. ఆ మనోహరి వెనక ఆ ఘోర ఉన్నాడు. అని గుప్త చెప్పగానే అరుంధతి బాధపడుతుంది. ఇంతలో మనోహరి వస్తుంది. అక్కాచెల్లెలు కలిసి ఈ మనోహరినే ఓడిద్దామనుకున్నారా? ఈ ప్రపంచమే ఏకమైనా నాకు అమర్‌కు పెళ్లి కాకుండా ఎవ్వరూ ఆపలేరు అంటూ లోపలికి వెళ్లిపోతుంటే చిన్న గాలిలా మనోహరికి తగులుతుంది.

దీంతో పక్కకు చూస్తుంది. పక్కన అరుంధతి నిలబడి ఉంటుంది. నేను కనిపిస్తున్నానా? అని అరుంధతి అడుగుతుంది. లోపలికి వచ్చి జరగబోయే సినిమా చూడు అంటూ మనోహరి వెళ్లిపోతుంది. దీంతో అరుంధతి గుప్తను ఏం జరుగుతుందని అడుగుతుంది. పరిస్థితులు ఆ బాలికకు అనుకూలంగా ఉన్నాయని గుప్త చెప్తాడు. లోపలికి వెళ్లిన మనోహరిని అమర్‌ నగలు తీసుకురాలేదని అడుగుతాడు. నిర్మల, శివరాం కూడా ఏమైందని అడుగుతారు.

నీలను ఆగుమన్న అమర్

మనోహరి మాట్లాడకుండా నీలను తన బ్యాగు లోపల పెట్టమని చెప్తుంది. దీంతో అమర్‌ ఆగు నీల అంటూ ఆ ఇంటి నుంచి ఎందుకు బయటకు వచ్చావని మనోహరిని అడుగుతాడు. మనోహరి ఏం చేయబోతోంది? మిస్సమ్మను అమర్​ ఇంట్లో నుంచి పంపిస్తాడా? అనే విషయాలు తెలియాలంటే ఏప్రిల్ 12న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం