Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి డిజిటల్ ఎంట్రీ...
19 June 2022, 11:08 IST
హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. కెరీర్ లో తొలిసారి ఓ వెబ్ సిరీస్ ను అంగీకరించింది. పులి మేక పేరుతో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఇందులో హీరోగా ఎవరు నటిస్తున్నారంటే...
లావణ్య త్రిపాఠి
ప్రస్తుతం సినిమాలకు ధీటుగా వెబ్ సిరీస్లు నటీనటులకు మంచి పేరుతీసుకొస్తున్నాయి. నటనాపరంగా ఛాలెంజెస్తో కూడిన క్యారెక్టర్స్ ను పోషించే అవకాశం లభిస్తుండటంతో వెబ్సిరీస్లపై నాయకానాయికలు దృష్టిసారిస్తున్నారు. గత రెండు, మూడేళ్లుగా టాలీవుడ్లో వెబ్సిరీస్ రూపొందించే ధోరణి పెరుగుతోంది. ఈ అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటున్న హీరోహీరోయిన్లు ఓ వైపు సినిమాలు చేస్తూనే వెబ్సిరీస్లపై లలో నటించేందుకు ఆసక్తిని చూపుతున్నారు. తాజాగా లావణ్య త్రిపాఠి డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అరంగేట్రం చేస్తోంది.
అందాల రాక్షసి సినిమాతో కథానాయికగా పరిచయమైన ఆమె జయాపజయాలకు అతీతంగా టాలీవుడ్లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. కెరీర్ లో తొలిసారి ఆమె ఓ వెబ్సిరీస్ను అంగీకరించింది. పులి మేక అనే టైటిల్తో ఈ వెబ్సిరీస్ రూపొందుతోంది. ఇందులో లావణ్య త్రిపాఠితో పాటు ఆదిసాయికుమార్ లీడ్రోల్స్ చేస్తున్నారు. బిగ్బాస్ ఫేమ్ సిరిహనుమంతు, సుమన్, ముక్కు అవినాష్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ సిరీస్ను జీ5 ఓటీటీ సంస్థతో కలిసి రచయిత కోన వెంకట్ నిర్మిస్తున్నారు.
పంతం ఫేమ్ కె చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. పోలీస్ బ్యాక్డ్రాప్కు ఆస్ట్రాలజీ అంశాలను ముడిపెడుతూ ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. పోలీసులను టార్గెట్ చేస్తూ వారిని హతమార్చే ఓ సీరియల్ కిల్లర్ ఎలా పట్టుబడ్డాడనే పాయింట్తో రూపొందిస్తున్నారు. శనివారం ఈ వెబ్సిరీస్ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించినట్లు తెలిసింది. ఈ వెబ్ సిరీస్ తోనే లావణ్య త్రిపాఠితో పాటు ఆది సాయికుమార్ డిజిటల్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
టాపిక్