తెలుగు న్యూస్  /  Entertainment  /  Kashmir Files Movie Nearing 150 Crore Mark

Kashmir Files | బాక్సాఫీస్‌ రికార్డులు తిరగరాస్తున్న కశ్మీర్‌ ఫైల్స్‌

HT Telugu Desk HT Telugu

20 March 2022, 11:59 IST

    • Kashmir Files మూవీ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. రిలీజైన 9 రోజుల తర్వాత కూడా బాక్సాఫీస్‌ దగ్గర ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది.
కశ్మీర్ ఫైల్స్ మూవీకి పెరుగుతున్న క్రేజ్
కశ్మీర్ ఫైల్స్ మూవీకి పెరుగుతున్న క్రేజ్ (REUTERS)

కశ్మీర్ ఫైల్స్ మూవీకి పెరుగుతున్న క్రేజ్

సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రమోట్‌ చేసిన కశ్మీర్‌ ఫైల్స్‌ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర అనూహ్యంగా దూసుకెళ్తోంది. ఓ చిన్న సినిమాగా రిలీజైన ఈ వివేక్‌ అగ్నిహోత్రి మూవీ.. ఇప్పుడు రూ.150 కోట్ల కలెక్షన్ల మార్క్‌కు చేరవవుతుండటం విశేషం. రోజురోజుకూ కలెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. 

ట్రెండింగ్ వార్తలు

Ranveer Singh: అల్లు అర్జున్ పాటకు స్టెప్స్ వేసిన రణ్‍వీర్ సింగ్.. వీడియో షేర్ చేసిన దేవీ శ్రీప్రసాద్

Krishnamma: ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఒకే వేదికపై రాజమౌళి, సుకుమార్ సహా మరో ముగ్గురు స్టార్ డైరెక్టర్లు

Ranveer Singh: రణ్‍వీర్ సింగ్ - ప్రశాంత్ వర్మ సినిమాకు టైటిల్ ఇదేనా?

Panchayat Season 3 OTT: పాపులర్ సిరీస్ పంచాయత్ మూడో సీజన్‍పై అప్‍డేట్ ఇచ్చిన ఓటీటీ ప్లాట్‍ఫామ్

తాజాగా 9వ రోజు అయిన శనివారం ఈ మూవీ తన అత్యధిక ఒకరోజు కలెక్షన్లను నమోదు చేసింది. శనివారం ఒక్క రోజే కశ్మీర్‌ ఫైల్స్‌ రూ.24.80 కోట్ల వసూలు చేసినట్లు ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ చెప్పారు. దీంతో ఇప్పటి వరకూ ఈ మూవీ మొత్తం బాక్సాఫీస్‌ కలెక్షన్లు రూ.141.25 కోట్లకు చేరాయి. రెండో వారం పూర్తయ్యే సరికి రూ.150 కోట్లు మార్క్‌ అందుకుంటుందని మొదట భావించినా.. ఇప్పుడు సోమవారంతోనే ఆ రికార్డు అందే అవకాశాలు ఉన్నాయి. 

రెండో వారం ముగిసే సమయానికి మొత్తం కలెక్షన్లు రూ.175 కోట్ల మార్క్‌ కూడా దాటేస్తుందని అంచనా. ఆదివారం ఈ మూవీ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఒక్క రోజే రూ.28 కోట్లయినా రావచ్చని చెబుతున్నారు. తొలిరోజు కేవలం రూ.3.55 కోట్ల కలెక్షన్లకే పరిమితమైన ఈ మూవీ.. క్రమంగా తన రికార్డును పెంచుకుంటూ వస్తోంది. సినిమాకు పాజిటివ్‌ రివ్యూలు రావడం, ఈ మూవీ సక్సెస్‌ను అడ్డుకోవాలని చూస్తున్నారంటూ సాక్షాత్తూ ప్రధాని మోదీయే అనడంతో కశ్మీర్‌ ఫైల్స్‌కు పబ్లిసిటీ విపరీతంగా పెరిగిపోయింది. 

8వ రోజే ఈ మూవీ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. మొదట్లో కేవలం 630 స్క్రీన్లలో రిలీజైన ఈ సినిమా.. రెండో వీకెండ్‌కు 4000 స్క్రీన్లకు చేరింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోకీ డబ్‌ చేశారు. 1990ల్లో చెలరేగిన కశ్మీర్‌ తిరుగుబాటులో భాగంగా అక్కడి పండిట్లు లోయను వదిలి వలస వెళ్లిన తీరును ఈ సినిమా కళ్లకు కట్టింది. ఈ మూవీ చూసిన చాలా మంది భావోద్వేగానికి గురవుతున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.