తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anni Manchi Sakunamule Trailer: క్లీన్ ఎంటర్టైనర్‌గా అన్నీ మంచి శకునములే ట్రైలర్.. తారక్ చేతుల మీదుగా రిలీజ్

Anni Manchi Sakunamule Trailer: క్లీన్ ఎంటర్టైనర్‌గా అన్నీ మంచి శకునములే ట్రైలర్.. తారక్ చేతుల మీదుగా రిలీజ్

12 May 2023, 19:43 IST

    • Anni Manchi Sakunamule Trailer: సంతోష్ శోభన్ హీరోగా నటించిన అన్నీ మంచి శకునములే ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజైంది. మే 18న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
అన్నీ మంచి శకునములే ట్రైలర్
అన్నీ మంచి శకునములే ట్రైలర్

అన్నీ మంచి శకునములే ట్రైలర్

Anni Manchi Sakunamule Trailer: టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే కల్యాణం కమణీయం, శ్రీదేవి శోభన్ బాబు లాంటి చిత్రాలతో సందడి చేశాడు. అయితే ఈ చిత్రాలు అనుకున్న స్థాయిలో ఆకట్టుకోనప్పటికీ తన వంతు ప్రయత్నంగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ప్రస్తుతం అతడు నటించిన సరికొత్త చిత్రం అన్నీ మంచి శకునములే. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు అన్నీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

ట్రెండింగ్ వార్తలు

Hi Nanna: హాయ్ నాన్న సినిమాకు మరో అంతర్జాతీయ వేదికపై అవార్డుల పంట.. ఆరు పురస్కారాలు: ఏఏ విభాగాల్లో వచ్చాయంటే..

Samantha: ‘అది ఫేక్’: సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమంత ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..

Chitram Choodara OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కామెడీతో పాటు ఎమోషనల్‌గానూ ఉంది. రాజేంద్రప్రసాద్, రావు రమేష్ నేతృత్వంలోని రెండు కుటుంబాల మధ్య శత్రుత్వం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబాలకు చెందిన హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. మరి వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందా? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

స్టోరీ రెగ్యూలర్‌గా అనిపిస్తున్నప్పటికీ దర్శకురాలు నందిని రెడ్డి తన స్క్రీన్ ప్లేతో కథను ఆసక్తికరంగా మార్చినట్లు తెలుస్తోంది. కామెడీతో పాటు భావోద్వేగాన్ని సమపాళ్లలో ఉన్నట్లు ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఇందులో నటించిన ప్రతి పాత్రకు తగిన గుర్తింపు, స్కోప్ ఉన్నట్లు అర్థమవుతుంది. నందిని రెడ్డి రైటింగ్ ఈ సినిమాకు మరో అదనపు ఆకర్షణ.

సంతోష్ శోభన్ సరసన మాళవిక నాయర్ ఇందులో హీరోయిన్‌గా చేసింది. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, గౌతమి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూర్చారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో మూవీ మరో స్థాయికి తీసుకెళ్లారు మిక్కీ. స్వప్న సినిమాస్ పతాకంపై ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.