తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan Game Changer: రామ్‌చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - గేమ్‌ఛేంజ‌ర్‌ సూప‌ర్ అప్‌డేట్ రివీల్ చేసిన‌ శంక‌ర్‌

Ram Charan Game Changer: రామ్‌చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - గేమ్‌ఛేంజ‌ర్‌ సూప‌ర్ అప్‌డేట్ రివీల్ చేసిన‌ శంక‌ర్‌

10 May 2023, 7:49 IST

  • Ram Charan Game Changer: రామ్‌చ‌ర‌ణ్ గేమ్‌ఛేంజ‌ర్ నుంచి సూప‌ర్ అప్‌డేట్‌ను డైరెక్ట‌ర్ శంక‌ర్ రివీల్ చేశాడు. ఆ అప్‌డేట్ ఏదంటే...

రామ్‌చ‌ర‌ణ్
రామ్‌చ‌ర‌ణ్

రామ్‌చ‌ర‌ణ్

Ram Charan Game Changer: గేమ్ ఛేంజ‌ర్ అప్‌డేట్స్ కోసం ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తోన్న మెగా ఫ్యాన్స్‌కు ద‌ర్శ‌కుడు శంక‌ర్ అదిరిపోయే న్యూస్ చెప్పారు. ఈ సినిమా క్లైమాక్స్ యాక్ష‌న్ ఎపిసోడ్ షూటింగ్ పూర్త‌యిన‌ట్లు తెలిపాడు. గ‌త ప‌దిహేను రోజులుగా హైద‌రాబాద్‌లోని శంషాబాద్‌లో వేసిన ప్ర‌త్యేక సెట్‌లో భారీ స్థాయిలో గేమ్‌ఛేంజ‌ర్ క్లైమాక్స్ సీన్‌ను చిత్రీక‌రిస్తోన్నారు ద‌ర్శ‌కుడు శంక‌ర్‌.

ట్రెండింగ్ వార్తలు

Romeo OTT Release Date: విజయ్ ఆంటోనీ ‘రోమియో’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటే..

Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

దాదాపు 1200 మంది ఫైట‌ర్ల‌లో నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ ఫైట్ మాస్ట‌ర్స్‌ అన్బుఅరివు సార‌థ్యంలో తెర‌కెక్కిస్తోన్న ఈ క్లైమాక్స్ యాక్ష‌న్ ఎపిసోడ్ షూటింగ్ మంగ‌ళ‌వారం నాటితో పూర్త‌యిన‌ట్లు శంక‌ర్ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. ఈ యాక్ష‌న్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్‌గా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం శంక‌ర్ గ‌త సినిమాలకు భిన్నంగా హాలీవుడ్ స్థాయిలో ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించేలా యాక్ష‌న్ సీన్ ఉంటుంద‌ని అంటున్నారు.

ఈ క్లైమాక్స్‌ యాక్ష‌న్ సీక్వెన్స్ కోసం హై స్పీడ్ మోష‌న్ కంట్రోల్ రోబో కెమెరా ఉప‌యోగించిన‌ట్లు స‌మాచారం. ఈ మోకోబాట్ పేరుతో పిలిచే ఓ కెమెరాను గ‌తంలో క‌మ‌ల్ హాస‌న్ విక్ర‌మ్ సినిమాలో యూజ్ చేశారు. కాగా ఈ యాక్ష‌న్ ఎపిసోడ్‌తో గేమ్‌ఛేంజ‌ర్ షూటింగ్ చాలా వ‌ర‌కు పూర్త‌యిన‌ట్లుతెలిసింది.

నెక్స్ట్ షెడ్యూల్ జూన్ ఫ‌స్ట్‌వీక్‌లో ప్రారంభంకానున్న‌ట్లు స‌మాచారం. పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

విన‌య‌విధేయ రామ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్, కియారా అద్వానీ జంట‌గా న‌టిస్తోన్న సినిమా ఇది. ఎస్‌జే సూర్య‌, సునీల్‌, శ్రీకాంత్‌, న‌వీన్ చంద్ర‌, అంజ‌లి కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తోన్నారు. దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తోన్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.