తెలుగు న్యూస్  /  Entertainment  /  Balakrishna Veera Simha Reddy Trailer Release Date Fix

Veera Simha Reddy Trailer Update: వీరసింహుడి ఉగ్రరూపానికి ముహూర్తం ఫిక్స్.. ట్రైలర్ విడుదలయ్యేది అప్పుడే

05 January 2023, 21:39 IST

    • Veera Simha Reddy Trailer Update: నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రబృందం. శుక్రవారం నాడు ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయనుంది.
బాలయ్య వీరసింహారెడ్డి
బాలయ్య వీరసింహారెడ్డి

బాలయ్య వీరసింహారెడ్డి

Veera Simha Reddy Trailer Update: నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ లాంటి సూపర్ హిట్ తర్వాత ఫుల్ బిజీగా మారారు. ఓ పక్క హీరోగానే చేస్తూ.. మరోపక్క వ్యాఖ్యతగానూ అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన తాజా చిత్ర వీరసింహారెడ్డి. క్రాక్ లాంటి సూపర్ హిట్ తర్వాత గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా గురించి సరికొత్త అప్డేట్ వచ్చింది. వీరసింహారెడ్డి ట్రైలర్ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

SS Rajamouli: అనిల్ రావిపూడి మీద ముసుగేసి గుద్దేస్తే 10వేలు ఇస్తా: దర్శక ధీరుడు రాజమౌళి.. ఎందుకు ఇలా అన్నారంటే..

OTT Movies This Weekend: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి రానున్న ఈ 4 చిత్రాలను మిస్ అవొద్దండి!

Rajinikanth Biopic: రజినీకాంత్ బయోపిక్ హక్కులను తీసుకున్న బాలీవుడ్ నిర్మాత! వివరాలివే

Panchayat S3 Release: ఈనెలలోనే స్ట్రీమింగ్‍కు రానున్న పంచాయత్ సీజన్ 3.. డేట్ కోసం ఫ్యాన్స్‌కు పని పెట్టిన ఓటీటీ

వీరసింహారెడ్డి ట్రైలర్‌ను శుక్రవారం అంటే జనవరి 6 సాయంత్రం 8.17 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రేపు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఒంగోలు వేదికగా వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్టును షేర్ చేసింది.

వీరసింహుడి ఉగ్రరూపం చూడాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందేనంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా చేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమాను నవీన్ యర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా చేస్తోంది. తమన్ సంగీతాన్ని సమకురుస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్స్ అందించగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్ మాస్టార్లుగా రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.