తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun 20 Years Journey: హీరోగా 20 ఏళ్ల జ‌ర్నీ కంప్లీట్ చేసుకున్న అల్లు అర్జున్ - ఎమోష‌న‌ల్ పోస్ట్ వైర‌ల్‌

Allu Arjun 20 Years Journey: హీరోగా 20 ఏళ్ల జ‌ర్నీ కంప్లీట్ చేసుకున్న అల్లు అర్జున్ - ఎమోష‌న‌ల్ పోస్ట్ వైర‌ల్‌

28 March 2023, 13:28 IST

  • Allu Arjun 20 Years Journey: అల్లు అర్జున్ హీరోగా సినిమా ఇండ‌స్ట్రీలోకి అరంగేట్రం చేసి మంగ‌ళ‌వారం నాటితో ఇర‌వై ఏళ్లు పూర్త‌య్యాయి.  ఈ ప్ర‌యాణాన్ని గుర్తుచేసుకుంటూ బ‌న్నీ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

అల్లు అర్జున్
అల్లు అర్జున్

అల్లు అర్జున్

Allu Arjun 20 Years Journey: అల్లు అర్జున్ సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టి మంగ‌ళ‌వారం నాటితో ఇర‌వై ఏళ్లు పూర్త‌య్యాయి. హీరోగా రెండు ద‌శాబ్దాల ప్ర‌యాణం పూర్తిచేసుకోవ‌డంపై సోష‌ల్ మీడియాలో ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టాడు అల్లు అర్జున్‌. అభిమానులు, ప్రేక్ష‌కులు చూపించిన ఆద‌ర‌ణ‌, ప్రేమ వ‌ల్లే హీరోగా తాను ఈ స్థాయికి చేరుకున్న‌ట్లుగా పేర్కొన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Jyothi Rai: గుప్పెడంత మనసు జ్యోతి రాయ్ అశ్లీల వీడియోలు వైరల్.. అలా చేస్తే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తామంటూ..

Partner OTT: రెండు ఓటీటీల‌లో రిలీజైన‌ హ‌న్సిక క‌న్ఫ్యూజ‌న్ కామెడీ మూవీ - అబ్బాయి...అమ్మాయిగా మారితే!

Undekhi Season 3: ఓటీటీలోకి మరో రెండు రోజుల్లో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 3.. ఎక్కడ చూడాలంటే?

Brahma Anandam Movie: కొడుకుకు తాత‌గా న‌టిస్తోన్నటాలీవుడ్ టాప్ క‌మెడియ‌న్ - బ్ర‌హ్మ ఆనందం టైటిల్ రివీల్‌

“ఈ రోజుతో నేను ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ఇర‌వై ఏళ్లు పూర్త‌య్యాయి. ఈ ప్ర‌యాణంలో ఎంతో మంది ప్రేమ‌, ఆద‌ర‌ణ‌ను సొంతం చేసుకోవ‌డం అదృష్టంగా భావిస్తున్నా. జ‌ర్నీలో నాకు అండ‌గా నిలిచి నా విజ‌యానికి కార‌ణ‌మైన ఇండ‌స్ట్రీలోకి ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నా. అభిమానుల ప్రేమ‌, ఆద‌ర‌ణ వ‌ల్లే న‌టుడిగా ఈ స్థాయికి చేరుకున్నాన‌ని” బ‌న్నీ ఈ పోస్ట్‌లో పెర్కొన్నాడు. అత‌డి ఎమోష‌న‌ల్ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

2003లో కే రాఘ‌వేంద్రరావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన గంగోత్రి సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్‌. ఈ సినిమాలో అత‌డి న‌ట‌న‌, లుక్‌పై చాలా విమ‌ర్శ‌లొచ్చాయి. ఆ నెగెటివ్ కామెంట్స్‌ను పాజిటివ్‌గా తీసుకుంటూ వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సినిమాలు చేస్తూ అగ్ర హీరోల్లో ఒక‌రిగా ఎదిగాడు అల్లు అర్జున్‌.

2021లో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రిలీజైన పుష్ప సినిమాతో పాన్ ఇండియ‌న్ హీరోగా మారిపోయాడు. ప్ర‌స్తుతం పుష్ప సినిమా సీక్వెల్‌తో బ‌న్నీ బిజీగా ఉన్నాడు. ఈ సీక్వెల్ వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. పుష్ప -2 తో పాటు ఇటీవ‌లే సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో పాన్ ఇండియ‌న్ సినిమాకు అల్లు అర్జున్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.