తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Yusuf Pathan Tmc : టీఎంసీ లోక్​సభ లిస్ట్​లో యూసఫ్​ పఠాన్​.. మహువా మోయిత్రా ఈజ్​ బ్యాక్​!

Yusuf Pathan TMC : టీఎంసీ లోక్​సభ లిస్ట్​లో యూసఫ్​ పఠాన్​.. మహువా మోయిత్రా ఈజ్​ బ్యాక్​!

Sharath Chitturi HT Telugu

10 March 2024, 14:55 IST

    • TMC Lok Sabha elections list : మాజీ క్రికెటర్​ యూసఫ్​ పఠాన్​కి లోక్​సభ సీటు ఇచ్చింది టీఎంసీ. మహువా మోయిత్రాకు కూడా అవకాశం ఇచ్చింది టీఎంసీ.
యూసఫ్​ పఠాన్​
యూసఫ్​ పఠాన్​

యూసఫ్​ పఠాన్​

TMC Lok Sabha candidates liేt : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పోరాటానికి సిద్ధపడిన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్​ కాంగ్రెస్​ (టీఎంసీ).. పశ్చిమ్​ బెంగాల్​లోని మొత్తం లోక్​సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు.. ఆదివారం మధ్యాహ్నం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి.. 42మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేశారు మమతా బెనర్జీ. జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్​ యూసఫ్​ పఠాన్​ కూడా ఉన్నారు. ఇక.. లోక్​సభ నుంచి బహిష్కారానికి గురైన మహువా మోయిత్రాపై దీదీ మరోమారు నమ్మకం ఉంచారు. ఆమెకు మళ్లీ టికెట్​ ఇచ్చారు. అయితే.. మమతా బెనర్జీ అభ్యర్థుల లిస్ట్​.. బీజేపీ కన్నా ఇండియా కూటమికే ఎక్కువ నష్టం కలిగించే విధంగా ఉందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి!

ట్రెండింగ్ వార్తలు

Peddapalli Lok Sabha : కార్మికుడిగా కొప్పుల ప్రచారం, పైగా లోకల్ నినాదం - ఆసక్తికరంగా మారుతున్న 'పెద్దపల్లి' పోరు..!

Elections in Telugu States : ఎన్నికల వేళ ప్రయాణికుల రద్దీ - 22 రైళ్లకు అదనపు కోచ్‌లు

Loksabha Polls 2024 : ప్రతిసారీ మోసం చేస్తున్నారు, ఈసారి మేం ఓటేయం..! భద్రాద్రి జిల్లాలో ఫ్లెక్సీ , రంగంలోకి అధికారులు

EC Orders to AP Govt : సంక్షేమ పథకాల నిధుల జమ ప్రక్రియను వెంటనే నిలిపివేయండి - ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు

లోక్​సభ ఎన్నికలకు టీఎంసీ లిస్ట్​..

పశ్చిమ్​ బెంగాల్​లో మొత్తం 42 లోక్​సభ సీట్లు ఉన్నాయి. తాజాగా.. వీటికి అభ్యర్థులను ప్రకటించింది టీఎంసీ. బహరంపూర్​ నుంచి మాజీ క్రికెటర్​ యూసఫ్​ పఠాన్​ని బరిలోకి దింపింది. యూసఫ్​ పఠాన్​.. కాంగ్రెస్​ సీనియర్​ నేత, లోక్​సభలో కాంగ్రెస్​ సభాపక్ష నేత అధీర్​ రంజన్​ చౌదరీతో పోటీపడనున్నారు.

ఇక అవినీతి కేసులో వేటుకు గురైన మహువా మోయిత్రాకు మరోమారు అవకాశం ఇచ్చారు మమతా బెనర్జీ. 2019లో ఆమె పోటి చేసి గెలిచిన కృష్ణానగర్​ లోక్​సభ నియోజకవర్గం నుంచి మహువా మోయిత్రా మళ్లీ బరిలో దిగనున్నారు.

హింసాత్మక ఘటనలతో, మహిళల నిరసనలతో గత కొన్ని వారాలుగా దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన సందేశ్​ఖాళీ విషయంలో కీలక మార్పే చేసింది టీఎంసీ. 2019లో అక్కడ గెలిచిన నుష్రత్​ జహాన్​కు ఈసారి.. టీఎంసీ లిస్ట్​లో చోటు దక్కలేదు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే!

ఇండియా కూటమికి షాక్​..!

2024 Lok Sabha elections : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్​డీఏని గద్ద దింపడమే లక్ష్యంగా ఏర్పడింది విపక్ష ఇండియా కూటమి! ఈ కూటమిలో మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ, పశ్చిమ్​ బెంగాల్​ చాలా కీలకం! మోదీని ఢీకొట్టాలంటే.. ఈ రాష్ట్రంలోని 42 సీట్లు చాలా ముఖ్యమైనవి. అయితే.. సీట్ల సద్దుబాటు విషయంలో కాంగ్రెస్​, టీఎంసీ, సీపీఐకి సెట్​ అవ్వలేదు! మరీ ముఖ్యంగా.. మమత- కాంగ్రెస్​ మధ్య ప్రతిష్ఠంభన నెలకొంది. సొంతంగా పోటీ చేస్తామని దీదీ చెప్పినప్పటికీ.. 'లేదు లేదు.. ఇంకా చర్చలు జరుగుతున్నాయి' అని కాంగ్రెస్​ ఇంతకాలం చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు.. మొత్తం 42 సీట్లకు అభ్యర్థులను ప్రకటించి.. కాంగ్రెస్​కు షాక్​ ఇచ్చింది టీఎంసీ.

లోక్​సభ అభ్యర్థుల లిస్ట్​ని టీఎంసీ ప్రకటించిన కొద్దిసేపటికే.. ఆ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది కాంగ్రెస్​. ‘గౌరవప్రదమైన సీట్ల సద్దుబాటు కోసం ప్రయత్నించాము,’ అని పేర్కొంది.

సీట్ల సద్దుబాటు విషయంలో ఇండియా కూటమికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతూ వస్తున్నాయి. అతి కష్టం మీద.. దిల్లీ, గుజరాత్​లో ఆమ్​ ఆద్మీతో కాంగ్రెస్​ సీట్లను సద్దుబాటు చేసుకుంది. యూపీలో సమాజ్​వాదీ పార్టీతో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి!