Vizag RK Beach: మద్యం మత్తులో యువతి వీరంగం.. పచ్చి బూతులు తిడుతూ పోలీసులపై దాడి!
15 December 2022, 12:09 IST
- Vishakapatnam Latest Crime News: వైజాగ్ ఆర్కే బీచ్లో అర్ధరాత్రి ఓ యువతి వీరంగం సృష్టించింది. మద్యం మత్తులో ASI పై దాడి చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వైజాగ్ బీచ్ ప్రాంతం(ఫైల్ ఫొటో)
Young woman attacked ASI at Vizag: విశాఖలోని ఆర్కే బీచ్లో ఓ యువతి వీరంగం సృష్టించింది. మద్యం మత్తులో బూతుల వర్షం కురిపించింది. ఆర్కే బీచ్ పరిధిలో నైట్ రౌండ్స్కి వెళ్లిన పోలీసులకు ఓ యువతి మద్యం సేవిస్తూ కనిపించింది. ఆమె వద్దకు వెళ్లిన పోలీసులు ఆరా తీసే ప్రయత్నం చేశారు. దీంతో ఆ యువతి రెచ్చిపోయింది. ఇష్టానుసారంగా తిట్టింది. ఓ దశలో పోలీసులపై బీర్ బాటిల్ తో దాడికి యత్నించింది.
లేపించేస్తానంటూ వార్నింగ్..
ఆర్కే బీచ్ ప్రాంతంలో మద్యం సేవిస్తూ కంటపడింది ఓ యువతి. వెంటనే ఆమె వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. వెంటనే త్రీ టౌన్ ఏఎస్ఐ సత్యనారాయణపై తిరగబడింది. తీవ్రంగా దుర్భాషలాడటమే కాకుండా కాలితో తన్నింది. తన బాయ్ ఫ్రెండ్కి చెప్పి లేపించేస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది. పోలీసులెవ్వరినీ రోడ్డు మీదే తిరగకుండా చేస్తానంటూ మాట్లాడింది. ఈ తతంగాన్నంతా వీడియో తీస్తున్న వ్యక్తిపై సైతం బాటిల్తో దాడికి దిగింది.
సదరు యువతిని బ్రీత్ అనలైజర్తో పరీక్షలు చేయగా ఆల్కహాల్ కంటెంట్ 148 mg కి పైగా నమోదైంది. కేసు నమోదు చేసుకున్న విశాఖ నగర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు ఇందుకు సంబంధించిన వీడియో లు వైరల్ గా మారాయి.