తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Unknown Dead Body In Train

Dead Body Rail Coach : రైలు బోగీలో మృతదేహం

HT Telugu Desk HT Telugu

13 June 2022, 12:03 IST

    • శ్రీకాకుళం నుంచి తిరుపతి చేరుకున్న రైలులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. తిరుపతి వచ్చిన సమ్మర్ స్పెషల్ ట్రైన్‌ జనరల్ బోగీలో మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రైలు బోగీలో మృతదేహం
రైలు బోగీలో మృతదేహం

రైలు బోగీలో మృతదేహం

శ్రీకాకుళం నుంచి తిరుపతి వచ్చిన రైలులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. తిరుపతి వచ్చిన సమ్మర్‌ స్పెషల్‌ ట్రైన్‌ కోచింగ్ డిపోకు తరలించి శుభ్రం చేస్తుండగా పారిశుధ్య సిబ్బంది జనరల్ బోగీలో మృతదేహాన్ని గుర్తించారు. తిరుపతి రైల్వే స్టేషన్‌ అధికారుల ఫిర్యాదుతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Nalgonda Ellayya: వీడిన నల్గొండ కాంగ్రెస్‌ నాయకుడు ఎల్లయ్య మర్డర్ మిస్టరీ, ట్రాప్‌ చేసి జగ్గయ్యపేటలో హత్య

AP TS Summer Updates: పగటిపూట బయట తిరగకండి, ముదురుతున్న ఎండలు… వడదెబ్బకు ప్రాణాలు విలవిల

AP EMRS Inter Admissions : ఏపీ ఏకలవ్య జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు-మే 3 నుంచి దరఖాస్తులు ప్రారంభం

AP Govt Salaries: ఎలక్షన్ ఎఫెక్ట్‌... ఒకటో తేదీనే ఉద్యోగుల జీతాలు, సర్వీస్ పెన్షన్లు... ఐదేళ్లలో ఇదే రికార్డ్

 మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మృతదేహాన్ని రుయాకు తరలించారు. మృతుడు ఏ ప్రాంతానికి చెందిన వాడో తెలియకపోవడంతో అన్ని రైల్వే పోలీస్‌ స్టేషన్లకు సమాచారం అందించారు. మృతుడు నలుపుటీషర్ట్‌, బ్రౌన్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. 45-50 సంవత్సరాల వయసు ఉండొచ్చని భావిస్తున్నారు.   వేసవి ఎండలను తాళలేకపోవడం, వడదెబ్బతో మృతి చెంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు.  రైలు టిక్కెట్ లేకపోవడంతో ఇంటి నుంచి వచ్చేసి ఉండటమో, యాచకుడో అయ్యుండొచ్చని  పోలీసులు భావిస్తున్నారు. మృతుడిని ఎవరైనా గుర్తించగలిగితే తిరుపతి పోలీసుల్ని సంప్రదించాలని కోరారు.

టాపిక్