తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Hit By Train: నెల్లూరులో విషాదం.. రైలు ఢీకొని ముగ్గురు మృతి

Hit by Train: నెల్లూరులో విషాదం.. రైలు ఢీకొని ముగ్గురు మృతి

HT Telugu Desk HT Telugu

22 January 2023, 8:21 IST

    • Nellore District Crime News: నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆత్మకూర్ బస్టాండ్ రైల్వే బ్రిడ్జిపై రైలు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
నెల్లూరు జిల్లాలో విషాదం
నెల్లూరు జిల్లాలో విషాదం

నెల్లూరు జిల్లాలో విషాదం

Three Killed After Being Hit By A Train: రైలు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ విషాద ఘటన శనివారం రాత్రి నెల్లూరు జిల్లాలో జరిగింది. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద నున్న రైల్వే బ్రిడ్జిపై ఇద్దరు పురుషులు, ఒక మహిళ వస్తుండగా- గూడూరు వైపు నుంచి విజయవాడ వెళుతున్న నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పురుషులు, ఓ మహిళ మృతి చెందింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ట్రెండింగ్ వార్తలు

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

AP LAWCET 2024 Updates : ముగియనున్న 'ఏపీ లాసెట్' దరఖాస్తు గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

చనిపోయిన వారి నుంచి కొన్ని సంచులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో టీటీడీ లాకర్‌ అలాట్‌మెంట్‌ టిక్కెట్టు ఉన్నట్లు గుర్తించారు. ఓ ఫోన్ నెంబర్ కూడా దొరకటంతో వీటి ఆధారంగా వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. నిజంగానే ప్రమాదమా లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.