తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Pm Didnt Give Assurance To Pawan Kalyan On Alliance With Tdp

Too Early Politics : పొత్తుల లెక్కలు తేలనట్టేనా…టీడీపీ జట్టుకు ప్రధాని విముఖత..?

HT Telugu Desk HT Telugu

13 November 2022, 10:28 IST

    • Too Early Politics ప్రధాని నరేంద్ర మోదీతో జనసేన అధ‌్యక్షుడు పవన్ కళ్యాణ్ జరిపిన చర్చల్లో ఎన్నికల పొత్తుల అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు కూడ గట్టేందుకు తెలుగుదేశం పార్టీని  కలుపుకుపోవాలనే ప్రతిపాదనకు ప్రధాని నుంచి సానుకూల స్పందన రాలేదని బీజేపీవర్గాలు చెబుతున్నాయి. 
ప్రధానితో భేటీలో పవన్ కళ్యాణ్....
ప్రధానితో భేటీలో పవన్ కళ్యాణ్....

ప్రధానితో భేటీలో పవన్ కళ్యాణ్....

Too Early Politics ప్రధాని పర్యటనతో జనసేనలో కొత్త ఉత్సాహం వస్తుందని భావించినా పవన్ కళ్యాణ‌్ ఆశించిన ప్రతిస్పందన ప్రధాని నుంచి రాలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎటూ తేల్చుకోలేని సంకట స్థితిలో పడిపోయినట్లు తెలుస్తోంది. ప్రధానితో చర్చలు ఆశాజనకంగా లేకపోయినా భవిష్యత్తులో ఫలిస్తాయనే భావన మాత్రం పవన్ కళ్యాణ్‌లో కనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

Railway UTS APP: రైల్వే జనరల్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం, మొబైల్‌లోనే జనరల్ టిక్కెట్లు కొనొచ్చు…

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్‌సీపీని ఎదుర్కోవడానికి అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు పవన్‌ కళ్యాణ్‌ చేసిన ప్రతిపాదనకు సానుకూల స్పందన వస్తుందని జనసేన అధినేత ఆశాభావం ఉన్నారు. బీజేపీ నుంచి రోడ్ మ్యాప్‌ కావాలని పదేపదే కోరుతున్న పవన్ కళ్యాణ్ దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్‌ మళ్లీ గత శుక్రవారం ప్రధానితో భేటీ అయ్యారు.

పవన్ కళ్యాణ్‌ ఆలోచనల ప్రకారం ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి అధికార వైసీపీకి వ్యతిరేకంగా పోరాడాలని యోచిస్తున్నారు. బీజేపీతో మితృత్వం ఉన్నా, బలమైన టీడీపీని విడిచిపెడితే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోతుందని పవన్ కళ‌్యాణ్ భావిస్తున్నారు. అందుకే టీడీపీని కూడా బీజేపీతో కలిపేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రతిపాదిత కూటమిలో టీడీపీ కూడా ఉండాలని ప్రధానితో పవన్ కళ్యాణ్ ప్రతిపాదించినా , ప్రధాని అంతగా ఉత్సాహం చూపలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ప్రధానితో సమావేశం దాదాపు అరగంట పాటు జరిగిందని జనసేన వర్గాలు చెబుతుంటే, ప్రధానితో 10 నిమిషాల సమయం మాత్రమే సమావేశం జరిగిందని బీజేపీ వర్గాలు తెలిపాయి.

అప్పుడే ఎందుకు…..

సాధారణ ఎన్నికలకు 19 నెలల ముందు - టీడీపీతో పొత్తు గురించి మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదని, ఎన్నికల పొత్తుల కోసం “హడావిడి” చేయవద్దని మోడీ పవన్ కళ్యాణ్‌కు సూచించారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ వైఫల్యాలను బట్టబయలు చేసే కార్యక్రమాలను చేపట్టాలని, అందుకు బిజెపి పూర్తి మద్దతును అందిస్తుందని పవన్‌ కళ్యాణ్‌కు ప్రధాని సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు.

“బిజెపికి సంబంధించినంతవరకు, టీడీపీతో పొత్తుపై బీజేపీ వైఖరిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టత ఇచ్చినట్లేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం పవన్ కల్యాణ్‌పై ఉందని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు

గత నెలలో విశాఖ ఎపిసోడ్‌ తర్వాత విజయవాడలో జరిగిన సమావేశం అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్‌కల్యాణ్‌ ఇద్దరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నంలో చేయి చేయి కలపాలని ప్రకటించిన సంగతి తెలిసిందే….

ఎనిమిదేళ్ల తర్వాత శుక్రవారం విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీని పవన్ కల్యాణ్ కలిశారు. 2014 ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన చివరిసారిగా మోదీని కలిశారు.

“టీడీపీతో పొత్తు విషయంలో పవన్ తొందరపడుతున్నట్లు కనిపిస్తోంది. 2014 నాటి కూటమిని పవన్ తిరిగి కోరుకుంటున్నారు, బహుశా టిడిపి నుండి వచ్చిన ఒత్తిడి వల్ల కావచ్చు, కానీ ఈ పొత్తులపై బిజెపికి ఆసక్తి చూపడం లేదని ఉత్తరాంధ్రకు చెందిన బీజేపీ నాయకుడు చెప్పారు.

"బిజెపి మరియు టిడిపిలలో ఎవరితో కలిసి ముందుకు సాగాలనే విషయంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు సంకట స్థితిలో ఉండొచ్చనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది.