తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirupati Crime News : హోటల్ వెళ్లిన వివాహిత, ఆమె ప్రియుడు.. ఆ తర్వాత

Tirupati Crime News : హోటల్ వెళ్లిన వివాహిత, ఆమె ప్రియుడు.. ఆ తర్వాత

HT Telugu Desk HT Telugu

09 November 2022, 15:43 IST

    • Tirupati Crime News : తిరుపతిలో దారుణం జరిగింది. ఇష్టంలేని పెళ్లి చేశారని మనస్తాపంతో ఓ వివాహిత, ఆమె ప్రియుడు కలిసి ఆత్మహత్య చేసుకున్నారు.
క్రైమ్ న్యూస్
క్రైమ్ న్యూస్ (HT_PRINT)

క్రైమ్ న్యూస్

ఇష్టం లేని పెళ్లి చేశారని మనస్తాపంతో తిరుపతి(Tirupati)లో ఓ వివాహిత, ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సీఐ శివప్రసాద్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్(Hyderabad) జీడిమెట్ల పరిధిలోని షాపూర్‌కు చెందిన అనూష(21)కు తూర్పుగోదావరి(East Godavari) జిల్లా తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామానికి చెందిన గుడ్ల పోసిబాబుతో రెండేళ్ల క్రితం వివాహమైంది. కొవ్వూరు ఆంధ్రా షుగర్స్‌లో పనిచేస్తున్న పోసిబాబు తన భార్యతో కలిసి కొంతకాలంగా కొవ్వూరులో నివసిస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఈ నెల 5న పోసిబాబు తన భార్య అనూష కనిపించడం లేదంటూ కొవ్వూరు పట్టణ(Kovvuru Town) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను 4వ తేదీ ఉదయం డ్యూటీకి వెళ్లానని, 5వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటికి వచ్చేసరికి భార్య కనిపించడం లేదన్నాడు. చాలా చోట్ల వెతికినా ఆచూకీ లభించలేదని పోలీసులకు తెలిపాడు. పోసిబాబు ఇంట్లో అనూష రాసిన లేఖ దొరికింది. ఈ నేపథ్యంలో పట్టణ ఎస్‌ఐ బి.దుర్గాప్రసాద్‌ మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

అనూష గతంలో హైదరాబాద్‌లోని షాపూర్‌ ప్రాంతానికి చెందిన కృష్ణారావు (23) అనే యువకుడిని ప్రేమించి పెళ్లి(Love Marriage) చేసుకోవాలనుకున్నట్లుగా తెలుస్తోంది. కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. రెండేళ్ల క్రితం అనూష, పోసిబాబు పెళ్లి చేసుకున్నారు. ఆమె కృష్ణారావును మరిచిపోలేకపోవడంతో ఈ నెల 5న ఇద్దరూ కలిసి తిరుపతి వెళ్లారు. గోవిందరాజస్వామి దేవాలయం సమీపంలోని లాడ్జి వద్ద దిగిన వీరిద్దరూ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య(Suicide)కు పాల్పడ్డారు.

మంగళవారం ఉదయం గది ఖాళీ చేయాల్సి ఉండగా ఎంతసేపటికీ బయటకు రాలేదు. అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. లాడ్జిలో దొరికిన ఫోన్ ఆధారంగా మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

'జంట వారి గది నుండి బయటకు రాకపోవడంతో, లాడ్జి సిబ్బంది ఉదయం వెళ్లి చూశారు. కిటికీలోంచి చూడగా పైకప్పుకు వేలాడుతున్న జంట మృతదేహాలను కనిపించాయి. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.' అని ఎస్‌ఐ తెలిపారు.

యువతి బంధువులను విచారించగా.. ప్రియుడు వేరే కులస్థుడు కావడంతో రెండేళ్ల క్రితం పొసిబాబుతో ఇష్టంలేని పెళ్లి చేశారని తెలిసింది. కలిసి జీవించాలనే తమ కోరికను కుటుంబ సభ్యులు అంగీకరించరని కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.