తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Govt Age Concession Of 5 Years For Economically Weaker Sections In Job Recruitments

EWS Age Concession : గుడ్ న్యూస్... EWS ఉద్యోగార్థులకు వయోపరిమితి పెంపు

HT Telugu Desk HT Telugu

25 February 2023, 13:09 IST

    • AP Govt Latest News: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల భర్తీలో బీసీ,ఎస్పీ,ఎస్టీల మాదిరిగానే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(EWS)కు వయోపరిమితిని ఐదేళ్లు పెంచారు.
కీలక ఉత్తర్వులు ఇచ్చిన ఏపీ సర్కార్
కీలక ఉత్తర్వులు ఇచ్చిన ఏపీ సర్కార్

కీలక ఉత్తర్వులు ఇచ్చిన ఏపీ సర్కార్

AP Govt On EWS Age Concession: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఉద్యోగ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఈడబ్ల్యుఎస్‌ వారికి ఐదేళ్ల వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ,ఎస్సీ,ఎస్టీ తరహాలోనే ఈడబ్ల్యుఎస్‌కు ఐదేళ్ల వయోపరిమితిని ప్రభుత్వం పెంచింది. ఫలితంగా ప్రస్తుతం 34 ఏళ్లు ఉన్న వయోపరిమితి 39 ఏళ్లకు పెరగనుంది. తద్వారా ఉద్యోగాల భర్తీలో ఆయా వర్గాలకు మేలు జరగనుంది.

ట్రెండింగ్ వార్తలు

NEET UG Admit Card 2024 : నీట్‌ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP ICET Hall Tickets: ఏపీ ఐసెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదల, మే 6,7 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష

AP ECET Hall Tickets: ఏపీ ఈసెట్‌ 2024 హాల్‌టిక్కెట్లు విడుదల, రూ.5వేల జరిమానాతో నేడు కూడా దరఖాస్తుల స్వీకరణ

Nalgonda Ellayya: వీడిన నల్గొండ కాంగ్రెస్‌ నాయకుడు ఎల్లయ్య మర్డర్ మిస్టరీ, ట్రాప్‌ చేసి జగ్గయ్యపేటలో హత్య

ఏపీ సర్కార్ ఉత్తర్వులు

పీఆర్సీ అమలు…

ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు సర్కార్ తీపికబురు చెప్పింది. ప్రభుత్వంలోని ప్రజా రవాణాశాఖ (పీటీడీ)లోకి ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు విలీనమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పదోన్నతి పొందిన 2,096 మందికి పీఆర్సీ అమలు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. 51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులు 2020 జనవరి ఒకటి నుంచి పీటీడీలోకి విలీనం అయ్యారు. ఆ తర్వాత వీరిలో 2,096 మందికి ఆర్టీసీ యాజమాన్యం పదోన్నతులు కల్పించింది. డీపీసీ నిబంధనలకు విరుద్ధంగా.. ప్రభుత్వ అనుమతి లేకుండా వీరికి ప్రమోషన్ ఇచ్చారని ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. వీరికి మినహా, మిగిలిన ఉద్యోగులకు గతేడాది సెప్టెంబరు నుంచి పీఆర్సీ అమలు చేశారు. ఆ తర్వా తఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విన్నవించాయి. ఫలితంగా 2096 మంది ఉద్యోగులకు ఈ ఒక్కసారికి పీఆర్సీ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మరోవైపు హైదరాబాద్‌–విజయవాడ హైవే, విజయవాడ–చెన్నై హైవేలను కలుపుతూ పల్నాడు ప్రాంతంలోని అద్దంకి–నార్కెట్‌పల్లి ప్రధాన రహదారికి కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్‌ హైవేగా నామకరణం చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంపై గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.