ధ్యానం అంటే శ్వాస మీద ద్యాస పెట్టడం. ఆలోచనలు మన నియంత్రణలో ఉంచుకుని ధ్యానం చేయాలి. ధ్యానం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మనమీద మనకు స్పష్టత వస్తుంది. ప్రశాంతత పెరుగుతుంది. ధ్యానం చేయడానికి చాలా రకాల విధానాలుంటాయి. వాటిలో ఒకటి ఈ రెయిన్ బో మెడిటేషన్. దీనివల్ల మనసు మన అదుపులో ఉంటుంది. దాన్నెలా చేయాలో కూడా తెల్సుకోండి. కేవలం ఏడు నిమిషాలు కేటాయిస్తే నిర్మలమైన మనసు మీ సొంతమవుతుంది.
పేరులో ఉన్నట్లుగా రెయిన్ బో లేదా ఇంద్ర ధనస్సులో ఉండే రంగుల ఆధారంగా ఈ ధ్యానం చేయాలి. VIBGYOR ఈ పదం ఇంద్రధనస్సులో ఉండే రంగుల్ని సూచిస్తుందని తెల్సిందే. రెడ్ (ఎరుపు), ఆరంజ్, యెల్లో (పసుపు), గ్రీన్ (ఆకుపచ్చ), బ్లూ (నీలం), ఇండిగో(ఊదా), వయోలెట్.. ఇలా ఇంధ్ర దనస్సులో ఉండే ఏడు రంగుల్ని వెనకనుంచి చదివితే వాటి రంగుల క్రమం తెలుస్తుంది. వీటిని ఊహించుకుంటూ రెయిన్ బో ధ్యానం చేయాలి.
ఇప్పుడు ఈ ఒక్కో రంగును ఊహిస్తూ మీ ఊహల్లో నుంచి బయటకు రండి. చివరగా మీకు పూర్తిగా ఆకాశంలో మెరుస్తున్న ఇంద్రధనస్సు కనిపించాలి. మీ మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. సంపూర్ణత్వాన్ని అనుభవించండి. కేవలం ఏడు నిమిషాలు కేటాయించి మీ మెదడును ఈ రెయిన్ బో మెడిటేషన్ తో డిటాక్స్ చేసుకోండి. రెయిన్ బో మెడిటేషన్ను కూడా చాలా రకాల విధానాలు అవలంబిస్తూ చేయొచ్చు.
టాపిక్