లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) వినియోగదారులకు అందిస్తున్న లైఫ్ ఎండోమెంట్ ప్లాన్ జీవన్ ఆనంద్ పాలసీ. ఈ పాలసీతో పాలసీదారులకు అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పాలసీలో ప్రీమియం చెల్లింపు గడువు ముగిసిన తర్వాత కూడా బీమా కవరేజీ కొనసాగుతుంది. ప్రతి రోజు కేవలం రూ. 45 పెట్టుబడి పెడితే పాలసీదారులు 35 ఏళ్లలో రూ. 25 లక్షల మొత్తాన్ని పొందవచ్చు. ఇందులో టర్మ్ పాలసీ, బోనస్, డెత్ బెనిఫిట్లను మాత్రమే కాకుండా అదనంగా యాక్సిడెంటల్ డెత్ , డిసెబిలిటీ రైడర్తో సహా అదనపు రైడర్లను కూడా అందిస్తుంది.
జీవన్ ఆనంద్ పాలసీలో అనువైన ప్రీమియం చెల్లింపు ఎంపికతో పాటు, రెండేళ్ల కాలపరిమితితో సరెండర్ చేయవచ్చు. ఈ పాలసీతో సురక్షితమైన ఆర్థిక ప్రణాళికతో పాటు తగినంత రాబడి, లైఫ్ కవర్ హామీ లభిస్తుంది. ప్రమాదవశాత్తు పాలసీదారుడు మరణిస్తే ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ రూ. 5 లక్షల వరకు అదనపు కవరేజీని అందిస్తుంది. ప్రమాదంలో శాశ్వత వైకల్యానికి దారితీసినట్లయితే విడతల వారీగా బీమా మొత్తాన్ని పాలసీదారుడికి అందిస్తారు.
ఈ పాలసీలో 35 సంవత్సరాల వ్యవధిలో రూ.5,70,500 మొత్తం డిపాజిట్ చేస్తే రూ.5 లక్షల హామీతో రెండు బోనస్లు లభిస్తాయి. మెచ్యూరిటీ తర్వాత పాలసీదారు డిపాజిట్ చేసిన మొత్తంపై అదనంగా రూ.8.60 లక్షల రివిజనరీ బోనస్, రూ.11.50 లక్షల తుది బోనస్కు పొందవచ్చు. ఈ బోనస్లకు అర్హత సాధించాలంటే 15 సంవత్సరాల కాలవ్యవధి ఉండాలి.
సంబంధిత కథనం