IRCTC Kedar Badri Kartik Tour : కేదార్ నాథ్, బద్రీనాథ్, కార్తీక్(మురుగన్) కోవిల్ దివ్య క్షేత్రాలను దర్శించుకునేందుకు 13 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది ఐఆర్సీటీసీ. ఉత్తరాఖండ్ టూరిజం, ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా కేదార్-బద్రీ-కార్తీక్ యాత్ర అందిస్తోంది. ఈ పర్యటనలో దేవభూమి ఉత్తరాఖండ్లోని కార్తికేయ స్వామికి అంకితం చేసిన కార్తీక స్వామి దేవాలయంతో పాటు పూజ్యమైన కేదార్నాథ్, బద్రీనాథ్ ధామ్లతో పాటు గుప్తకాశీలో పర్యటించవచ్చు. ఈ పర్యటనలో గుప్తకాశీ - కేదార్నాథ్ - గుప్తకాశీ మార్గంలో హెలికాప్టర్ సదుపాయం కూడా ఉంది. మధురైలో బయలుదేరే భారత్ గౌరవ్ రైలు తెలుగు రాష్ట్రాల్లో గూడూరు, విజయవాడ, వరంగల్ మీదుగా వెళ్తుంది.
వర్గం -సింగిల్/డబుల్/ట్రిపుల్- పిల్లలు (5-11 సంవత్సరాలు)
పర్యటన ఇలా : మధురై - రిషికేశ్ - రుద్రప్రయాగ - గుప్తకాశీ - కేదార్నాథ్ - జోషిమఠ్ - బద్రీనాథ్
రైలు ప్రయాణం ఇలా : మధురై - దిండిగల్ జంక్షన్ - తిరుచిరాపల్లి - విల్లుపురం - చెన్నై ఎగ్మోర్ - గూడూరు జంక్షన్ - విజయవాడ - వరంగల్ - నాగ్ పూర్ - యోగ్ నగరి రిషికేశ్
బోర్డింగ్/డీబోర్డింగ్ స్టేషన్లు : మధురై, దిండిగల్ జంక్షన్, తిరుచిరాపల్లి, విల్లుపురం, చెన్నై ఎగ్మోర్, గూడూరు జంక్షన్, విజయవాడ, వరంగల్, నాగ్పూర్
సీట్ల సంఖ్య : 300 (AC III)
Group A : రుద్రప్రయాగ నుంచి గుప్తకాశీ, అక్కడ నుంచి కేదార్నాథ్ వరకు హెలీకాఫ్టర్ తీసుకెళ్తారు. తిరిగి గుప్తకాశీ నుంచిహెలీకాఫ్టర్ లో రుద్రప్రయాగకు చేరుకుంటారు.
Group B : రుద్రప్రయాగ నుంచి కార్తీక స్వామి దేవాలయం, గుప్తకాశీ వరకు (మొత్తం రోడ్డు ప్రయాణం 95 కి.మీ) వెళ్తారు.
Group C : రుద్రప్రయాగ నుంచి జోషిమఠానికి వెళ్తారు.
Group A : రుద్రప్రయాగ నుంచి కార్తీక స్వామి దేవాలయం వెళ్తారు. తిరిగి రుద్రప్రయాగకు చేరుకుంటారు.
Group B : గుప్తకాశీ నుంచి కేదార్నాథ్కి హెలీకాఫ్టర్ లో వెళ్తారు. తిరిగి గుప్తకాశీ, తర్వాత రుద్రప్రయాగకు చేరుకుంటారు.
Group C : జోషిమఠ్ నుంచి బద్రీనాథ్, అక్కడి నుంచి జోషిమఠ్, రుద్రప్రయాగకు తిరిగి వస్తారు.
Group A : రుద్రప్రయాగ నుంచి జోషిమఠానికి వెళ్తారు.
Group B : రుద్రప్రయాగ నుంచి జోషిమఠ్ ( 115 కి.మీ)
Group C : రుద్రప్రయాగ నుంచి గుప్తకాశీ అక్కడి నుంచి కేదార్నాథ్ వరకు హెలీకాఫ్టర్ లో వెళ్తారు. తిరిగి గుప్తకాశీకి, రుద్రప్రయాగకు వెళ్తారు.
Group A : జోషిమఠ్ నుంచి బద్రీనాథ్ వెళ్తారు. తిరిగి జోషిమఠ్ చేరుకుంటారు.
Group B : జోషిమఠ్ నుంచి బద్రీనాథ్, తిరిగి జోషిమఠ్ (మొత్తం 90 కి.మీ )
Group C : రుద్రప్రయాగ నుంచి కార్తీక స్వామి ఆలయానికి వెళ్తారు. తిరిగి రుద్రప్రయాగకు చేరుకుంటారు.
Group A : తిరుగు ప్రయాణం కోసం జోషిమఠ్ నుంచి రిషికేశ్ చేరుకుంటారు.
Group B : తిరుగు ప్రయాణం కోసం జోషిమత్ నుంచి రిషికేశ్ ( 250 కి.మీ ) వెళ్తారు.
Group C : తిరుగు ప్రయాణం కోసం రుద్రప్రయాగ నుంచి రిషికేశ్ చేరుకుంటారు.
మధురై, తెలుగు రాష్ట్రాలు నుంచి కేదార్ నాథ్-బద్రీనాథ్-కార్తీక్ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు కోసం ఈ కింద లింక్ పై క్లిక్ చేయండి.
సంబంధిత కథనం