YS Sharmila | దళిత బిడ్డపై దాడి జరిగితే కేసు తీసుకోరు.. ఇది ఆప్ఘనిస్తాన్ ను తలపించటం లేదా..?
24 May 2023, 17:38 IST
- దళిత బిడ్డపై దాడి జరిగితే న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్తే కనీసం కేసు కూడా నమోదు చేయటం లేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రజల కోసం కొట్లాడుతున్న బంగారు తెలంగాణలో దళిత బిడ్డకు జరుగుతున్న న్యాయం ఇది అని అన్నారు. యుగేంధర్ అనే దళిత న్యాయవాది ఎమ్మెల్యే గాధరి కిషోర్ చేస్తున్న అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తే ఆయన అనుచరులు దాడులు చేయడం సిగ్గుచేటన్నారు.