తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mulugu District: వివాహేతర సంబంధం ఆరోపణలు.. కాలుతున్న గడ్డపారను తీయాలంటూ 'అగ్నిపరీక్ష'

Mulugu District: వివాహేతర సంబంధం ఆరోపణలు.. కాలుతున్న గడ్డపారను తీయాలంటూ 'అగ్నిపరీక్ష'

02 March 2023, 15:12 IST

  • shocking incident in mulugu: ములుగు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ములుగు మండలం బంజెరుపల్లికి చెందిన జగన్నాథం గంగాధర్‌ ఒక వివాహితతో సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ కులపెద్దలు గత మూడు నెలల్లో 20 సార్లు పంచాయితీ నిర్వహించారు. తనకు సంబంధం లేదని నిరూపించుకోవడానికి పెద్దలు గంగాధర్‌కు అగ్నిపరీక్ష పెట్టారు. మంటలో కాలిన గడ్డపారను చేతులతో తీసి బయటపడేయాలన్నారు. గాయాలు కాకుంటే ఆమెతో సంబంధం లేదని నమ్ముతామని, గాయాలైతే జరిమానాగా రూ.11 లక్షలు చెల్లించాలని నిర్దేశించారు. దాని ప్రకారం గోవిందరావుపేట మండలం లక్నవరం చెరువు శిఖం ప్రదేశానికి వెళ్లి అక్కడ పెద్ద మనుషుల సమక్షంలో పిడకలతో అగ్నిగుండం ఏర్పాటు చేశారు. గంగాధర్‌ పక్కన ఉన్న చెరువులో స్నానం చేసి తడి దుస్తులతో వచ్చి తన చేతులతో గడ్డపారను అగ్ని గుండంలోంచి తీసి బయట పడేశాడు. ఈ క్రమంలో తనకు గాయాలు కాకపోయినా రూ.11 లక్షలు చెల్లించాలని వేధిస్తుండడంతో గంగాధర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు... ఆరోపణలు చేసిన వ్యక్తితో పాటు ఇరువైపులా ఉన్న పెద్దమనుషులపై కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.