తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kavitha On Bjp : రాముడి పేరు చెప్పి.. రౌడీయిజం చేస్తున్నారు

Kavitha On BJP : రాముడి పేరు చెప్పి.. రౌడీయిజం చేస్తున్నారు

23 November 2022, 16:42 IST

  • బీజేపీపై ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బ‌య‌టి లీడ‌ర్లను తీసుకువ‌చ్చి రాజ‌కీయం చేయ‌డం బీజేపీ ప‌ని అని అన్నారు. ఈడీ, ఐటీల‌తో కేసులు పెట్టి బెదిరిస్తున్నారన్నారు. నాగిరెడ్డిపేట టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. బీజేపీ చేస్తున్న ప‌ని రామ్ రామ్ జ‌ప్నా..ప‌రాయి లీడ‌ర్ అప్నా అని వ్యాఖ్యానించారు. నెల రోజుల నుండి మంత్రుల‌ను, ఎమ్మెల్యేల‌ను వ‌ద‌ల‌కుండా రైడ్ చేస్తున్నారని, మీరు ఏం చేస్తారో చేసుకోండి తెలంగాణ వాళ్లు భయ‌ప‌డే వాళ్లు కాదని చెప్పారు. వ్యాపారం లీగ‌ల్ చేసుకుంటారు.. అధికారులు అడిగితే స‌మాదానం చేబుతారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కోనుగోలు కేసులో బిఎల్ సంతోష్ పేరును విచారణకు పిలిస్తే ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు.